పాస్‌పోర్టు కేంద్రాన్ని ఏర్పాటు చేయండి | deputy minister mahamood ali asks sushma swaraj to provide passport service center | Sakshi
Sakshi News home page

పాస్‌పోర్టు కేంద్రాన్ని ఏర్పాటు చేయండి

Feb 12 2015 3:03 AM | Updated on Sep 2 2017 9:09 PM

హైదరాబాద్‌లోని పాతబస్తీలో పాస్‌పోర్టు సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్‌కు తెలంగాణ ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ విజ్ఞప్తి చేశారు.

- సుష్మకు మహమూద్ అలీ వినతి


హైదరాబాద్: హైదరాబాద్‌లోని పాతబస్తీలో పాస్‌పోర్టు సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్‌కు తెలంగాణ ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ విజ్ఞప్తి చేశారు. న్యూఢిల్లీలో బుధవారం సుష్మాస్వరాజ్‌ను కలసి ఈ మేరకు వినతి పత్రాన్ని సమర్పిం చారు. అలాగే హైదరాబాద్‌లో సౌదీ కాన్సులేట్ ఏర్పాటు చేయాలని కోరారు. అనంతరం కేంద్ర మైనార్టీ, పార్లమెంట్ వ్యవహారాల మంత్రి అబ్బాస్ నఖ్వీని కలిసిన అలీ మైనార్టీల అభివృద్ధి కోసం అమలవుతున్న పథకాలకు చేయూత అందించాలని కోరారు. ఆ తర్వాత తెలంగాణ భవన్ గురజాడ సమావేశ మందిరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి రామచంద్రు తేజావత్‌తో కలసి వివరాలు తెలిపారు. ఢిల్లీ టూర్‌లో సౌదీ అంబాసిడర్లతో సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని విజ్ఞప్తి చేశామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement