17 నుంచి సీపీఎం పాదయాత్ర | Sakshi
Sakshi News home page

17 నుంచి సీపీఎం పాదయాత్ర

Published Wed, Oct 12 2016 8:31 PM

17 నుంచి సీపీఎం పాదయాత్ర - Sakshi

ఖమ్మం : సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధి, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ అమలు కోసం ఈ నెల 17న ఆదిలాబాద్ జిల్లా నుంచి పాదయాత్ర  ప్రారంభిస్తున్నట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. ఖమ్మంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం అనేది ప్రజల బాగు కోసం తెచ్చుకున్నదని, ప్రజల పక్షాన నిరంతరం సీపీఎం పోరాడుతుందన్నారు. 
 
ప్రజా సమస్యల పరిష్కారం కోసం పాదయాత్ర చేపడుతుంటే సీఎంగా ఉన్న కేసీఆర్ అడ్డుకుంటామని చెప్పడం సరైంది కాదన్నారు. జిల్లాల ఏర్పాటును సీపీఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ స్వాగతిస్తుందని, కానీ, ప్రస్తుతం చేసిన జిల్లాల పునర్విభజనలో శాస్త్రీయత లోపించిందన్నారు. 10 జిల్లాలను 31 జిల్లాలుగా విభజించే సమయంలో ఏ ప్రాతిపాదికన చూసినా శాస్త్రీయత లేదని తమ్మినేని పేర్కొన్నారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement