గజ్వేల్ నియోజకవర్గం ములుగు మండలం ఫారెస్ట్ రీసెర్చ్ సెంటర్ను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం సందర్శించారు.
మెదక్: గజ్వేల్ నియోజకవర్గం ములుగు మండలం ఫారెస్ట్ రీసెర్చ్ సెంటర్ను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం సందర్శించారు. 500 ఎకరాల్లో ఫారెస్ట్ వర్సిటీ, మరో 500 ఎకరాల్లో హార్టీకల్చర్ యూనివర్సిటీ నెలకొల్పుతామని ఈ సందర్భంగా కేసీఆర్ వెల్లడించారు.
75 ఎకరాల్లో హాస్టళ్లు, ఆఫీసు రూముల ఏర్పాటు చేస్తామని, దీనంతటికి రూ. వెయ్యి కోట్లు అవసరమవుతుందని తెలిపారు. రూ.200 కోట్లు కేంద్రం నుంచి మంజూరయ్యాయరని, వారం రోజుల్లో తానే శంకుస్థాపన చేస్తానని సీఎం కేసీఆర్ వెల్లడించారు.