విజయవంతం చేయండి
రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ పిలుపు
సాక్షి, హైదరాబాద్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఈ నెల 5న రాత్రి 9 గంటలకు తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా దీపాలు వెలిగించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు కోరారు. కరోనా వైరస్పై పోరుకు సంఘీభావ సంకేతంగా, ప్రజల ఐక్యతను చాటేలా దీపాలు వెలిగించి, ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మానవజాతి తనకు పట్టిన పీడపై చేస్తున్న గొప్ప పోరాటం స్ఫూర్తివంతంగా సాగాలని ముఖ్యమంత్రి అభిలషించారు.
సంబంధిత వార్తలు