అన్నప్రాసన మరుసటి రోజే అనంతలోకాలకు.. | child dies of sun stroke | Sakshi
Sakshi News home page

అన్నప్రాసన మరుసటి రోజే అనంతలోకాలకు..

May 25 2015 9:30 PM | Updated on Sep 3 2017 2:40 AM

అన్నప్రాసన చేసుకున్న మరుసటిరోజే ఆ పాపకు వడదెబ్బ తగిలింది.

గార్ల (ఖమ్మం జిల్లా): అన్నప్రాసన చేసుకున్న మరుసటిరోజే ఆ పాపకు వడదెబ్బ తగిలింది. ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా సోమవారం తెల్లవారుజామున మృతి చెందింది. గార్ల మండలం బీఆర్‌ఎన్ తండాకు చెందిన భూక్యా రాజేష్, దేవి దంపతులకు ముగ్గురు పిల్లలు. తొలుత ఇద్దరు కుమారులు. తర్వాత ఆరు నెలల కూతురు త్రివేణి ఉన్నారు. ఆ పాపకు మర్రిగూడెం వెంకటేశ్వరస్వామి దేవాలయం ప్రాంగణంలో ఆదివారం అన్నప్రాసన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

శుభకార్యం జరుపుకున్న సంతోషం ఆ తల్లిదండ్రులకు కొద్ది గంటలు నిలువలేదు. అన్నప్రాసన రోజే ఎండతీవ్రత ఎక్కువగా ఉండటంతో పాప వడదెబ్బకు గురైంది. చికిత్స నిమిత్తం ఖమ్మంలో ఓ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో సోమవారం తెల్లవారుజామున పాప మృతిచెందింది. దీంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. ఆదివారం అన్నప్రాసనకు హాజరై, మరుసటి రోజు పాప అంత్యక్రియల్లో పాల్గొనాల్సి వచ్చిందని బంధువులు కన్నీరుమున్నీరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement