13 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత | ration rice caught in adilabad district | Sakshi
Sakshi News home page

13 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

Sep 30 2016 5:09 PM | Updated on Aug 17 2018 2:56 PM

రేషన్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ ఉంచిన మూడు కిరాణం దుకాణాలపై దాడులు నిర్వహించారు.

ఖానాపూర్: రేషన్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ ఉంచిన మూడు కిరాణం దుకాణాలపై దాడులు నిర్వహించిన అధికారులు 13 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాదీనం చేసుకున్నారు. అదిలాబాద్ జిల్లా ఖానాపూర్ మండల కేంద్రంలో పలు కిరాణ దుకాణాలలో రేషన్ బియ్యం విక్రయిస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించి మూడు దుకాణాలలో నిల్వ ఉంచిన 26 బస్తాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకొని కేసులు నమోదు చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement