కాంట్రాక్టు లెక్చరర్లను క్రమబద్దీకరిస్తాం: కడియం | Kadiyam Srihari Speech on Contract Employees Regularization | Sakshi
Sakshi News home page

కాంట్రాక్టు లెక్చరర్లను క్రమబద్దీకరిస్తాం: కడియం

Jan 3 2017 2:26 PM | Updated on Aug 11 2018 6:42 PM

కాంట్రాక్టు లెక్చరర్లను క్రమబద్దీకరిస్తాం: కడియం - Sakshi

కాంట్రాక్టు లెక్చరర్లను క్రమబద్దీకరిస్తాం: కడియం

కాంట్రాక్ట్‌ లెక‍్చరర‍్ల సర్వీసులను త‍్వరలో క్రమబద్దీకరిస్తామని మంత్రి కడియం శ్రీహరి ప్రకటించారు.

హైదరాబాద్‌: కాంట్రాక్ట్‌ లెక‍్చరర‍్ల సర్వీసులను త‍్వరలో క్రమబద్దీకరిస్తామని డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ప్రకటించారు. శాసనమండలిలో మంగళవారం కడియం శ్రీహరి మాట్లాడారు. కాంట్రాక్ట్ లెక్చరర్లను క్రమబద్దీకరించే ప్రయత‍్నంలో ఉస్మానియా విద్యార్థులు కోర్టును ఆశ్రయించడంతో ఈ అంశం పెండింగ్‌లో పడిందని చెప్పారు.

అయినప‍్పటికీ కోర్టు అననుమతితో ఈ ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు. దీనికి ప్రభుత‍్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. కాంట్రాక్ట్‌ లెక‍్చరర‍్లకు రూ.18 వేల నుంచి రూ. 27 వేలకు, డిగ్రీ కళాశాల లెక‍్చరర‍్లకు రూ. 20 వేల నుంచి రూ. 31 వేలకు పెంచామని వివరించారు. 

Advertisement
 
Advertisement
Advertisement