దుండగుల కాల్పుల్లో కానిస్టేబుల్ మృతి | Delhi Police constable shot dead in Shahbad Dairy | Sakshi
Sakshi News home page

దుండగుల కాల్పుల్లో కానిస్టేబుల్ మృతి

Aug 20 2016 8:42 AM | Updated on Aug 21 2018 8:23 PM

దేశ రాజధాని ఢిల్లీలో ఓ కానిస్టేబుల్ దారుణ హత్యకు గురయ్యాడు. షహబాద్ డైరీ ప్రాంతంలోని సమోసా చౌక్ వద్ద గత రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఓ కానిస్టేబుల్ దారుణ హత్యకు గురయ్యాడు. షహబాద్ డైరీ ప్రాంతంలోని సమోసా చౌక్ వద్ద గత రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ముగ్గురు ఆగంతకులు ఓ మహిళ మెడలో చైన్ దొంగలించేందుకు యత్నించగా,  కానిస్టేబుల్ వారిని అడ్డుకున్నాడు. దీంతో రెచ్చిపోయిన దుండగులు కానిస్టేబుల్పై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడినట్లు సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. అతడిని ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందినట్లు సమాచారం. మృతుడు ఆనంద్గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement