చెన్నైలో రూ. కోటిన్నర నగదు పట్టివేత | Central excise official seize Rs. one and half crore at chennai | Sakshi
Sakshi News home page

చెన్నైలో రూ. కోటిన్నర నగదు పట్టివేత

Jul 13 2014 11:09 AM | Updated on Sep 2 2017 10:15 AM

చెన్నైలో రూ. కోటిన్నర నగదు పట్టివేత

చెన్నైలో రూ. కోటిన్నర నగదు పట్టివేత

నగరంలోని మన్నడిలోగల ఒక ఇంటిలో దాచిన రూ.1.5 కోటి నగదును సెంట్రల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

నగరంలోని మన్నడిలోగల ఒక ఇంటిలో దాచిన రూ.1.5 కోటి నగదును సెంట్రల్ ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చెన్నై మన్నడిలో గల ఒక ఇంటిలో నగదు లావాదేవీలు ఎక్కువగా జరుగుతున్నట్లు ఉన్నట్టు కేంద్ర ఎక్సైజ్ విభాగానికి సమాచారం అందింది. సమాచారం మేరకు కేంద్ర ఆర్థిక నేరాల విభాగ పోలీసులు,  ఎక్సైజ్ అధికారులు మన్నడిలోగల ఆ ఇంటికి చేరుకుని తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో ఆ ఇంటిలో రూ.1.5 కోటి నగదు ఉన్నట్టు గుర్తించారు.  నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆ ఇంటిలో ఉన్న వ్యక్తుల వివరాలను అధికారులు తెలియచేయలేదు.

Advertisement
 
Advertisement
Advertisement