వనపర్తి జిల్లా పాన్గల్ మండలం తెల్లారెళ్లపల్లి గ్రామ శివారులో చిరుతల సంచారం కలకలం రేపుతోంది.
వనపర్తి లో చిరుతల సంచారం
Jan 5 2017 11:05 AM | Updated on Jul 30 2018 1:23 PM
పానగల్: వనపర్తి జిల్లా పాన్గల్ మండలం తెల్లారెళ్లపల్లి గ్రామ శివారులో చిరుతల సంచారం కలకలం రేపుతోంది. బుధవారం రాత్రి వ్యవసాయ బావి వద్దకు వెళ్లిన కొందరు గ్రామస్థులు చిరుతలు సంచరించడాన్ని గుర్తించారు. శివారులోని పొలాల్లో మూడు చిరుతలు సంచరిస్తున్నాయని చెప్పారు. దీంతో గ్రామస్థులు భయాందోళనలకు గురవుతున్నారు. తక్షణమే అధికారులు స్పందించి చిరుతల బెడద నుంచి కాపాడాలని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Advertisement
Advertisement