ముగిసిన ప్రపంచకప్ షూటింగ్
న్యూఢిల్లీ: ప్రపంచకప్ షూటింగ్ టోర్నమెంట్లో చివరి రోజు భారత్కు నిరాశే ఎదురైంది. గురువారం జరిగిన పురుషుల స్కీట్ ఈవెంట్లో షీరాజ్ షేక్ ఆరో స్థానంలో నిలిచాడు. అయితే తన ఏడేళ్ల కెరీర్లో తొలి ప్రపంచకప్ ఫైనల్ ఆడిన షీరాజ్ అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. క్వాలిఫయింగ్ రౌండ్లో 121 పాయింట్లు సాధించగా.. ఫైనల్ రౌండ్లో చోటు కోసం జరిగిన షూట్ ఆఫ్లో మాజీ ప్రపంచ చాంపియన్ జెస్పర్ హెన్సన్ (డెన్మార్క్)ను మించి రాణించాడు. అయితే ఫైనల్లో మాత్రం నిరాశపరిచి ఆరో స్థానంలో నిలిచాడు. గతంలో ఉత్తరప్రదేశ్ తరఫున అండర్–16 విజయ్ మర్చంట్ ట్రోఫీలో పాల్గొన్న షీరాజ్ ఫైనల్లోని 20 షాట్లలో 16 పాయింట్లు సాధించాడు. ‘ఇదో మంచి అనుభవం. అంతా బాగానే సాగినా కొన్ని షాట్లను మిస్ అయ్యాను.
మరింత మెరుగయ్యేందుకు అవకాశం ఉంది’ అని 26ఏళ్ల షీరాజ్ తెలిపాడు. రియో ఒలింపిక్ చాంపియన్ గాబ్రియల్ రోసెట్టిని వెనక్కి నెట్టి ఇటలీకి చెందిన షూటర్ రికార్డో ఫిలిప్పెలి స్వర్ణం సాధించాడు. తొలిసారిగా స్వదేశంలో జరిగిన ఈ మెగా ఈవెంట్లో భారత్ మొత్తం ఐదు పతకాలు సాధించింది. ఇందులో ఓ స్వర్ణం, రెండు రజతాలు, రెండు కాంస్యాలున్నాయి. పతకాల పట్టికలో చైనా, ఇటలీ, ఆస్ట్రేలియా, జపాన్ తర్వాత భారత్ ఐదో స్థానంలో నిలిచింది. పురుషుల 50మీ. పిస్టల్ ఈవెంట్లో జీతూ రాయ్ ఏకైక స్వర్ణం సాధించిన విషయం తెలిసిందే. శుక్రవారం ఈ చాంపియన్షిప్లో మిక్స్డ్ ఈవెంట్ విభాగంలో పోటీలు జరుగుతాయి. అయితే ప్రయోగాత్మకంగా నిర్వహిస్తున్న ఈ ఈవెంట్లలో సాధించిన పతకాలను పరిగణనలోకి తీసుకోరు.
భారత్కు ఐదో స్థానం
Published Fri, Mar 3 2017 12:29 AM
Advertisement
Advertisement
ఈనాడు సంస్థల ఛైర్మన్ రామోజీరావు కన్నుమూత
రాజీనామా చేసి వెళ్లిపోండి.. టీడీపీ కార్యకర్తల అల్టిమేటం
పట్టలేని సంతోషం.. మర్చిపోలేని విషాదం.. రెండూ ఈ నెలలోనే!
పిఠాపురం వర్మపై జనసేన దాడి
ఇదేం వ్యాధి..నిద్రలో షాషింగ్ చేయడమా..?
టీడీపీ యథేచ్ఛదాడులతో ఏపీలో ఆటవిక పరిస్థితులు: వైఎస్ జగన్
పాస్వర్డ్ మర్చిపోయాడు.. 11 ఏళ్ల తరువాత చూస్తే రూ. కోట్ల డబ్బు
T20 WC 2024: పాక్ను మట్టికరిపించిన అమెరికా జట్టులో సగం మంది మన వారే..!
తప్పక చదవండి
- ఒడిశా సీఎం ఎంపిక.. ఇద్దరు నేతలకు టాస్క్
- వైఎస్సార్సీపీ నేతల ఇళ్లపై దాడులు హేయం : సామినేని
- బాలకృష్ణ-బాబీ కొత్త సినిమా గ్లింప్స్ విడుదల
- ధరణిలో గోల్మాల్.. మణికొండలో భారీ భూకబ్జా!
- వరల్డ్కప్లో టీమిండియా సరికొత్త చరిత్ర.. సచిన్ ట్వీట్ వైరల్
- చదువుకు దాచిన డబ్బులు... సైబర్ నేరగాళ్ల పాలు!
- మరిన్ని చిక్కుల్లో సీమా హైదర్.. భారత్ వచ్చిన పాక్ భర్త?
- ఒకే రన్వేపై రెండు విమానాలకు అనుమతి ఉందా?
- ఏపీలో దాడులపై కేంద్రమంత్రి కిషన్రెడ్డి సీరియస్
- అమాంతం పెరిగిన చిరాగ్ ఫ్యాన్ ఫాలోయింగ్
Advertisement