సెమీస్‌లో సాయి కార్తీక్‌రెడ్డి | Sai Karthikreddy in semis of ITF Juniors Tennis | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో సాయి కార్తీక్‌రెడ్డి

Aug 30 2018 10:22 AM | Updated on Aug 30 2018 10:22 AM

Sai Karthikreddy in semis of ITF Juniors Tennis - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) జూనియర్స్‌ టోర్నమెంట్‌లో తెలంగాణ క్రీడాకారుడు సాయి కార్తీక్‌రెడ్డి సెమీఫైనల్‌కు చేరుకున్నాడు. ఎల్బీ స్టేడియంలో బుధవారం జరిగిన బాలుర సింగిల్స్‌ క్వార్టర్స్‌ మ్యాచ్‌లో ఐదోసీడ్‌ గంటా సాయి కార్తీక్‌రెడ్డి 6–1, 7–6 (6)తో కబీర్‌ హాన్స్‌పై విజయం సాధించాడు. ఇతర క్వార్టర్స్‌ మ్యాచ్‌ల్లో హైదరాబాద్‌ ప్లేయర్‌ ఎం. తీర్థ శశాంక్‌ 0–6, 1–6తో మేఘ్‌ భార్గవ్‌ పటేల్‌ చేతిలో ఓటమి పాలయ్యాడు. డెనిమ్‌ యాదవ్‌ 6–1, 6–4తో అనురా అగర్వాల్‌పై గెలుపొందాడు.

డబుల్స్‌ విభాగంలో తీర్థ శశాంక్‌ జోడీ సెమీస్‌కు చేరుకుంది. క్వార్టర్స్‌లో నాలుగోసీడ్‌ తీర్థ శశాంక్‌ – కెవిన్‌ పటేల్‌ ద్వయం 6–4, 6–2తో కృషన్‌ హుడా– డివిన్‌ వాద్వా జోడీపై నెగ్గింది. మరో మ్యాచ్‌లో సాయికార్తీక్‌ రెడ్డి– నైథాలిన్‌ కెల్విన్‌ జోడీ 6–7 (6), 1–6తో కబీర్‌ హాన్స్‌– తేజస్వి ఆర్‌. మెహ్రా ద్వయం చేతిలో పరాజయం పాలైంది. బాలికల క్వార్టర్స్‌ మ్యాచ్‌లో  హైదరాబాద్‌ అమ్మాయి రెండోసీడ్‌ శివాని అమినేని 3–6, 3–6తో సందీప్తి సింగ్‌ రావు చేతిలో ఓటమి పాలైంది. బాలికల డబుల్స్‌ క్వార్టర్స్‌ మ్యాచ్‌లో టాప్‌ సీడ్‌ శివాని అమినేని (భారత్‌)– మయి నపట్‌ నిరుండర్న్‌ (థాయ్‌లాండ్‌) ద్వయం 6–3, 6–3తో అనన్య– భక్తి షా (భారత్‌) జంటపై నెగ్గి సెమీస్‌కు చేరింది.

,, ,

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement