పోరాడి ఓడిన బోపన్న జంట  | Rohan ​Bopanna-Edouard ​Vasselin look for winning | Sakshi
Sakshi News home page

పోరాడి ఓడిన బోపన్న జంట 

May 11 2018 1:46 AM | Updated on May 11 2018 9:44 PM

 Rohan ​Bopanna-Edouard ​Vasselin look for winning - Sakshi

మాడ్రిడ్‌ ఓపెన్‌ మాస్టర్స్‌ సిరీస్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో రోహన్‌ బోపన్న (భారత్‌)–ఎడువార్డో రోజర్‌ వాసెలిన్‌ (ఫ్రాన్స్‌) జంటకు నిరాశ ఎదురైంది. స్పెయిన్‌లోని మాడ్రిడ్‌లో గురువారం జరిగిన పురుషుల డబుల్స్‌ రెండో రౌండ్‌లో బోపన్న–వాసెలిన్‌ ద్వయం 6–4, 6–7 (4/7), 5–10తో ‘సూపర్‌ టైబ్రేక్‌’లో రావెన్‌ క్లాసెన్‌ (దక్షిణాఫ్రికా)–మైకేల్‌ వీనస్‌ (న్యూజిలాండ్‌) జంట చేతిలో ఓడిపోయింది.

రెండో రౌండ్‌లో నిష్క్రమించిన బోపన్న జోడీకి 24,020 యూరోల (రూ. 19లక్షల 18 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 90 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement