తైక్వాండో టోర్నీలో కరణ్‌కు స్వర్ణం | Karan Gets Gold Medal in Taekwondo | Sakshi
Sakshi News home page

తైక్వాండో టోర్నీలో కరణ్‌కు స్వర్ణం

Feb 7 2019 10:32 AM | Updated on Feb 7 2019 10:32 AM

Karan Gets Gold Medal in Taekwondo - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కొరియన్‌ కల్చరల్‌ సెంటర్‌ డైరెక్టర్స్‌ కప్‌ తైక్వాండో చాంపియన్‌షిప్‌లో తెలంగాణ క్రీడాకారుడు కరణ్‌ టీకారామ్‌ చాంపియన్‌గా నిలిచాడు. న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన క్యాడెట్‌ బాలుర 35 కేజీల విభాగంలో కరణ్‌ స్వర్ణాన్ని కైవసం చేసుకున్నాడు. ఇదే టోర్నీలో రాష్ట్రానికి చెందిన ఎన్‌ఎన్‌ లీలావతి,  టి. గౌతమి, సిమ్రన్‌ కె. జైన్‌ రాణించారు.

జూనియర్‌ బాలికల విభాగంలో లీలావతి (46 కేజీలు), సీనియర్‌ బాలికల కేటగిరీలో గౌతమి (57 కేజీలు), సిమ్రన్‌ జైన్‌ (67 కేజీలు) మూడో స్థానంలో నిలిచి తలో కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. ఈ సందర్భంగా వైఎంసీఏ నారాయణగూడ కార్యదర్శి బీజే వినయ్‌ స్వరూప్, అధ్యక్షుడు ఆర్‌కే కృష్ణ పతకాలు సాధించిన క్రీడాకారులను అభినందించారు. వారు భవిష్యత్‌లో మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement