ప్రారంభమైన 99వ రోజు ప్రజాసంకల్పయాత్ర | Ys Jagan Prajasankalpayatra 99th Day Begin | Sakshi
Sakshi News home page

Feb 27 2018 8:59 AM | Updated on Jul 25 2018 5:35 PM

Ys Jagan Prajasankalpayatra 99th Day Begin - Sakshi

పాదయాత్రలో వైఎస్‌ జగన్‌

సాక్షి, ప్రకాశం : ప్రతిపక్షనేత, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి  చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర ప్రకాశం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. మంగళవారం ఉదయం మార్కాపురం నియోజకవర్గంలోని కటురివారిపాలెం నుంచి ఆయన 99వ రోజు పాదయాత్రను ఆరంభించారు. దారిపొడవునా ప్రజలు జననేతకు ఘనస్వాగతం పలుకుతున్నారు.

అక్కడి నుంచి కొండేపి నియోజకవర్గంలోని అగ్రహారం క్రాస్ రోడ్డు‌ మీదుగా తలమళ్ల చేరుకొని మధ్యాహ్న భోజన విరామం తీసుకుంటారు. అనంతరం ఫిరదోసినగర్, గోగినేనిపాలెం క్రాస్‌ రోడ్డు మీదుగా ఉప్పలపాడు చేరుకుంటారు. అక్కడ ప్రజలతో జగన్‌ మమేకం కానున్నారు. ఇప్పటి వరకు వైఎస్‌ జగన్‌ 1,323.8 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement