రాజీనామా చేసి పార్టీ మారండి | Sakshi
Sakshi News home page

రాజీనామా చేసి పార్టీ మారండి

Published Mon, Mar 4 2019 2:12 PM

Resign and change the party - Sakshi


అశ్వారావుపేటరూరల్‌: కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలు వారి పదవులకు రాజీనామా చేసి పార్టీ మారాలని టీపీసీసీ మహిళా జనరల్‌ సెక్రటరీ సున్నం నాగమణి అన్నారు. ఈ మేరకు ఆమె ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ.. ప్రజలు కాంగ్రెస్‌ పార్టీని నమ్మి ఓట్లు వేశారని, కానీ కొంతమంది ప్రజల నమ్మకాన్ని అధికార పార్టీకి అమ్ముకుంటూ, స్వలాభాల కోసమే ఆ పార్టీలోకి వెళ్తున్నట్లు ఆరోపించారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హాయంలోనే ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని గిరిజనులకు దాదాపు 3లక్షల ఎకరాలకు పోడు పట్టాలు అందాయని అన్నారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో ఒక్క ఎకరానికి కుడా పట్టా ఇవ్వలేదన్నారు. హరితహారం పథకం పేరుతో గిరిజనుల సాగులో ఉన్న పోడు భూములను బలవంతంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని ఆరోపించారు.

Advertisement
Advertisement