నేను ఎక్కడికి పోను.. కాంగ్రెస్‌లోనే ఉంటా | I Will Be In Congress Party Says Damodar Raja Narasimha | Sakshi
Sakshi News home page

నేను ఎక్కడికి పోను.. కాంగ్రెస్‌లోనే ఉంటా

Sep 5 2018 9:38 PM | Updated on Mar 18 2019 7:55 PM

I Will Be In Congress Party Says Damodar Raja Narasimha - Sakshi

మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ

సాక్షి, హైదరాబాద్‌ : తాను పార్టీ మారతానంటూ చాలా పుకార్లు వస్తున్నాయని, ఎక్కడికి పోనని కాంగ్రెస్‌లోనే ఉంటానని మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు. బుధవారం కాంగ్రెస్‌ ముఖ్యనేతలు దామోదర రాజనర్సింహ, కూన శ్రీశైలం గౌడ్‌, భిక్షపతి యాదవ్‌, డీకే అరుణ, రేవంత్‌ రెడ్డిలు మాజీ మంత్రి ముఖేష్‌ ఇంటిలో సమావేశమయ్యారు. అనంతరం మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీతో కాంగ్రెస్‌ పొత్తు ఉంటే బలమే కదా అన్నారు.

టీడీపీ కూడా ఒక రాజకీయపార్టీ అని చెప్పారు. టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడు డీఎస్‌ కాంగ్రెస్‌లోకి రావడాన్ని ఆహ్వానిస్తామన్నారు. కాంగ్రెస్‌ సముద్రం లాంటిదని వ్యాఖ్యానించారు. ఎవరన్నా కాంగ్రెస్‌లోకి రావచ్చని అభిప్రాయపడ్డారు. పొత్తులు, సీట్లు అధిష్టానం నిర్ణయస్తుందని తేల్చిచెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement