టీడీపీ వాళ్లే ఇసుక దొంగలు | Botsa Satyanarayana Comments On TDP | Sakshi
Sakshi News home page

టీడీపీ వాళ్లే ఇసుక దొంగలు

Dec 8 2019 4:56 AM | Updated on Dec 8 2019 4:56 AM

Botsa Satyanarayana Comments On TDP - Sakshi

శృంగవరపుకోట రూరల్‌: రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నపుడు ఇసుక దోపిడీతో కోట్లాది రూపాయలు కొల్లగొట్టారని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం గౌరీపురం వద్ద కృష్ణమహంతిపురం పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటైన పెట్రోల్‌ బంకును శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..  నామినేటెడ్‌ పదవుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 50శాతం పదవులు ఇస్తూ జీఓ తెచ్చామని, ఆ పదవుల్లో నియమించిన వారిని తొలగించే వీలులేకుండా చర్యలు కూడా తీసుకుంటున్నామన్నారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement