బోటులో క్యాబినెట్‌ మీటింగ్‌

Uttarakhand Cabinet Held Meeting In A Floating Boat - Sakshi

తెహెరి : మంత్రివర్గ సమావేశాన్ని నడుస్తున్న బోటులో నిర్వహించారు ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్‌ రావత్‌. బుధవారం మంత్రులతో కలిసి తెహెరి సరస్సులో వెళ్తున్న బోటులో క్యాబినెట్‌ సమావేశం నిర్వహించి కొత్త సాంప్రదాయానికి తెరతీశారు. ఈ సమావేశానికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు ఇంటర్‌నెట్‌లో చక్కర్లు కొడుతున్నాయి. పూలతో అందంగా అలంకరించిన బోట్‌లో ముఖ్యమంత్రి, మంత్రులు ప్రయాణిస్తూ పలు విషయాలను చర్చించారు. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై కేబినెట్‌ కీలక నిర్ణయాలు తీసుకుంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top