నేడు నగరానికి రాష్ట్రపతి | Today President to the city | Sakshi
Sakshi News home page

నేడు నగరానికి రాష్ట్రపతి

Dec 22 2016 4:40 AM | Updated on Sep 4 2017 11:17 PM

నేడు నగరానికి రాష్ట్రపతి

నేడు నగరానికి రాష్ట్రపతి

రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ దక్షిణాది రాష్ట్రాల శీతాకాల విడిదిలో భాగంగా గురువారం హైదరాబాద్‌ రానున్నారు.

ఈనెల 31 వరకు బొల్లారంలో శీతాకాల విడిది

సాక్షి, హైదరాబాద్‌/న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ దక్షిణాది రాష్ట్రాల శీతాకాల విడిదిలో భాగంగా గురువారం హైదరాబాద్‌ రానున్నారు. 22వ తేదీ నుంచి ఈ నెల 31 వరకు ఆయన బొల్లారంలో ఉన్న రాష్ట్రపతి నిలయంలో బస చేస్తారు. ఈ సమయంలో రాష్ట్రపతి ఇక్కణ్నుంచే కార్యకలాపాలు నిర్వహిస్తారు. గురువారం సాయంత్రం 5.30కు ప్రత్యేక విమానంలో రాష్ట్రపతి ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు చేరుకుంటారు. 23న ఆర్మీ కాలేజీ ఆఫ్‌ డెంటల్‌ సైన్స్‌ స్నాత కోత్సవానికి హాజరవుతారు. మధ్యాహ్నం హెచ్‌ఐసీసీలో ఫ్యాఫ్సీ అధ్యర్యంలో జరిగే సదస్సులో పాల్గొంటారు. 24న మహిళా దక్షత సమితి కార్యక్రమంలో పాల్గొంటారు.

25న బెంగళూరులో జరిగే 89వ భారత్‌ బంగా సాహిత్య సమ్మేళనం కార్యక్రమానికి హాజరవుతారు. 26న మౌలానా ఆజాద్‌ ఉర్దూ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొంటారు. 27న రాజ్‌భవన్‌లో గవర్నర్‌ ఇచ్చే విందుకు హాజరవుతారు. 29న ఉదయం తిరువనంతపురంలో జరిగే ఇండియన్‌ హిస్టరీ కాంగ్రెస్‌ సమావేశాలకు హాజరవుతారు. అదే రోజున మైసూరులో భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ జాతీయ సమ్మేళనంలో పాల్గొంటారు. రాత్రి హైదరాబాద్‌కు తిరిగి వస్తారు. 30న రాష్ట్రపతి నిలయంలో ప్రభుత్వ ప్రతినిధులు, రాజకీయ ప్రముఖులు, వీఐపీలకు విందు ఏర్పాటు చేస్తారు. 31వ తేదీ మధ్యాహ్నం ఢిల్లీకి తిరుగు పయనమవుతారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement