సీఆర్పీఎఫ్ కాన్వాయ్ పై కాల్పుల కలకలం | Terrorists Attack Security Convoy in Jammu and Kashmir's Anantnag, 6 Injured | Sakshi
Sakshi News home page

సీఆర్పీఎఫ్ కాన్వాయ్ పై కాల్పుల కలకలం

Dec 7 2015 11:48 AM | Updated on Aug 11 2018 9:02 PM

సీఆర్పీఎఫ్ కాన్వాయ్ పై కాల్పుల కలకలం - Sakshi

సీఆర్పీఎఫ్ కాన్వాయ్ పై కాల్పుల కలకలం

సెంట్రల్ రిజర్వ్ పోలీస్ సిబ్బంది వెళ్తోన్న ఓ కాన్వాయ్ పై టెర్రరిస్టులు కాల్పులకు తెగబడ్డారు.

శ్రీనగర్: సెంట్రల్ రిజర్వ్ పోలీస్ సిబ్బంది వెళ్తోన్న ఓ కాన్వాయ్ పై టెర్రరిస్టులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో కాన్వాయ్లో ప్రయాణిస్తున్న ఆరుగురు సీఆర్పీఎఫ్ సిబ్బంది గాయపడ్డారు. ఈ ఘటన జమ్మూకశ్మీర్లోని అనంతనాగ్లో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. దక్షిణ కశ్మీర్లోని శ్రీనగర్-జమ్మూ జాతీయ రహదారిపై నేటి ఉదయం సీఆర్పీఎఫ్ కాన్వాయ్ జమ్మూ నుంచి శ్రీనగర్ వెళ్తుండగా టెర్రరిస్టులు కాల్పులు జరిపారు.

శ్రీనగర్కు 50 కిలోమీటర్ల దూరంలోని బిజ్బెహరా గుండా వెళ్తుండగా ఈ ఉగ్ర ఘటన చోటుచేసుకుంది. గాయపడిన సీఆర్పీఎఫ్ సిబ్బందిని అనంతనాగ్ లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాల్పులకు పాల్పడ్డ ఉగ్రవాదుల కోసం ఆర్మీ బలగాలు అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement