జార్ఖండ్ రాజధాని రాంచీలో ఓ నగల దుకాణంలో భారీ దోపిడీ జరిగింది.
జార్ఖండ్ రాజధాని రాంచీలో ఓ నగల దుకాణంలో భారీ దోపిడీ జరిగింది. 12.25 కోట్ల రూపాయల విలువ చేసే బంగారు, వజ్రాల ఆభరణాలను దొంగలు ఎత్తుకెళ్లారు.
దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పట్టణంలో శని, ఆదివారాలు దుకాణాలను బంద్ చేశారు. ఆ సమయంలో దొంగలు గ్రిల్స్ను కత్తరించి షాపులోకి ప్రవేశించి నగలు దోచుకెళ్లారు. మంగళవారం షాప్ తెరవగానే ఈ విషయాన్ని గమనించిన యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. చోరీకి గురైన ఆభరణాల విలువను 12 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేశారు.