బాబ్రీపై నివేదిక సాధారణం కాదు

Report on Babri is not a common thing - Sakshi

న్యూఢిల్లీ/లక్నో: రామజన్మ భూమి –బాబ్రీ మసీదు కేసుకు సంబంధించి 2003లో భారత పురాతత్వ సర్వే (ఏఎస్‌ఐ) ఇచ్చిన నివేదిక సాధారణమైంది కాదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసుపై వాదనలు 33వ రోజుకు చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సున్ని వక్ఫ్‌ బోర్డ్‌ తరఫున సీనియర్‌ లాయర్‌ మీనాక్షి అరోరా మాట్లాడుతూ.. ఏఎస్‌ఐ సర్వే కేవలం వారి అభిప్రాయమే అని, అది బలహీనమైందని అన్నారు. ఈ నివేదికను బలపరిచే ఆధారాలు లేవని పేర్కొన్నారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ ఆధ్వర్యంలోని ధర్మాసనం స్పందిస్తూ.. కోర్టు కమిషనర్‌ ఆధ్వ ర్యంలో ఆ నివేదిక రూపు దిద్దుకుం దని స్పష్టం చేసింది. వివాదాస్పద స్థలాన్ని నిపుణులు క్షుణ్నంగా పరిశీలించి నివేదిక తయారు చేశారని తెలిపింది. 

కోర్టులో కల్యాణ్‌ సింగ్‌..
బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో కల్యాణ్‌ సింగ్‌  సీబీఐ ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసులో ఇప్పటికే పలువురు బీజేపీ నేతలను కోర్టు విచారిస్తోంది. కల్యాణ్‌ సింగ్‌ గతంలో రాజస్తాన్‌ గవర్నర్‌గా ఉండడంతో ఆయన విచారణను ఎదుర్కోలేదు.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top