న్యూఢిల్లీ: క్రీడాకారులకు సముచిత ప్రాధాన్యం ఇవ్వాలని స్పోర్ట్స్ ఫెడరేషన్లకు కేంద్ర యువజన, క్రీడల శాఖ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ విజ్ఞప్తి చేశారు. ఆటగాళ్లను అత్యంత ప్రముఖులుగా పరిగణించాలని సూచించారు. క్రీడల మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. తనపై విశ్వాసం ఉంచి, ప్రాధాన్యత కలిగిన శాఖ ఇచ్చినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు.
కాగా, కేంద్ర క్రీడల శాఖ మంత్రి బాధ్యతలు దక్కించుకున్న తొలి క్రీడాకారుడిగా రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ ఘనతకెక్కారు. ఒక క్రీడాకారుడు ఈ శాఖను దక్కించుకోవడం ఇదే ప్రథమం. 2004 ఏథెన్స్ ఒలింపిక్స్లో డబుల్ ట్రాప్ షూటింగ్లో వెండి పతకం సాధించారు. దశాబ్ధంపైగా షూటర్గా కొనసాగిన ఆయన పలు పతకాలు గెల్చుకున్నారు. కామన్వెల్త్, ఆసియా క్రీడల్లోనూ మెడల్స్ సాధించారు. 2005లో కేంద్ర ప్రభుత్వం ఆయనకు పదశ్రీ పురస్కారం ప్రదానం చేసింది. క్రీడాకారుడైన రాజ్యవర్థన్కు సంబంధిత మంత్రిత్వ శాఖ అప్పగించడంతో దేశంలో క్రీడారంగానికి మంచి జరుగుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
‘ప్రాధాన్య శాఖ ఇచ్చారు.. థ్యాంక్స్’
Published Sun, Sep 3 2017 6:18 PM
Related news
Related News by category
-
ఏమన్నా చెప్పండి.. మేనిఫెస్టోలో పెట్టేద్దాం
సాక్షి, అమరావతి: మాయ మాటలతో ప్రజలను వంచించడంలో తనకు తానే సాటైన చంద్రబాబు ఇంకా అదే ప్రయత్నంలో తలమునకలై ఉన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలను బుట్టలో వేసుకునేందుకు అమలుకాని అనేక హామీలను నోటికొచ్చినట్లు ఇచ్చేస్తున్న ఆయన ఇంకా అలాంటిమేమైనా ఉన్నాయా అని తెగ అన్వేషిస్తున్నారు. ప్రజల దృష్టిని ఆకర్షించే విషయాలు ఏమైనా ఉంటే చెప్పాలని పార్టీ నాయకులు, తన మద్దతుదారులను కోరుతున్నారు. ఎవరైనా అలాంటివి చెబితే వాటిని కూడా మేనిఫెస్టోలో పెట్టేయడానికి తంటాలు పడుతున్నారు. 2014లో ఇలాగే 600కి పైగా హామీలను ఎడాపెడా ఇచ్చేసి ప్రజలను మాయచేసి ఆ తర్వాత వాటన్నింటినీ బుట్టదాఖలు చేశారు. చివరికి మేనిఫెస్టోనే మాయం చేశారు. ఈ ఎన్నికల్లోనూ సూపర్ సిక్స్ అంటూ ఇప్పటికే మళ్లీ కొత్త హామీలిచ్చేశారు. ‘బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ’ పేరుతో వాటిని ప్రజల్లోకి వదిలారు. ముందస్తు మేనిఫెస్టో పేరుతో ఆరునెలల క్రితమే దాన్ని విడుదల చేశారు.మరోవైపు.. సీఎం వైఎస్ జగన్ అమలుచేస్తున్న అమ్మఒడి, రైతుభరోసా వంటి పథకాల పేర్లు మార్చి వాటిని అమలుచేస్తానని అందులో పేర్కొన్నారు. అలాగే, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన కొన్ని హామీలను కూడా కాపీకొట్టి అందులో పెట్టారు. అయితే, బాబు మాయా చరిత్రేమిటో తెలిసిన ప్రజలు దానికి కనీసం స్పందించలేదు. జనం తాను చెబితే నమ్మడంలేదని జనసేన అధ్యక్షుడు పవన్కళ్యాణ్తో కలిసి ఉమ్మడి మేనిఫెస్టోకు రూపకల్పన చేస్తున్నట్లు కొద్దిరోజులుగా చెబుతున్నారు. తాజాగా.. బీజేపీని కూడా కలుపుకుని మూడు పార్టీల పేరుతో మేనిఫెస్టో విడుదల చేయడానికి కసరత్తు చేస్తున్నారు. కానీ, 2014 ఎన్నికల్లోనూ ఇదే కూటమి పేరుతో ప్రధాని మోదీ, పవన్ తన ఫొటో కలిపి, తాను సంతకం చేసి మరీ చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేశారు. అధికారంలోకి వచ్చాక దాన్ని చెత్తబుట్టలో పడేయడంతో ప్రజలు కూడా 2019లో ఆయన్ని చెత్తలోకి నెట్టేశారు. ఇప్పుడు మళ్లీ అదే కూటమి పేరుతో ప్రజలను వంచించేందుకు నానాపాట్లు పడుతున్నారు.‘సూపర్ సిక్స్’తో సంబంధంలేకుండా ఎడాపెడా హామీలు..ఈ క్రమంలోనే తన ‘సూపర్ సిక్స్’తో సంబంధం లేకుండా చంద్రబాబు మరికొన్ని హామీలను ఎన్నికల సభల్లో ఎడాపెడా ఇచ్చిపారేశారు. అధికారంలోకి వస్తే మెగా డీఎస్సీ నిర్వహిస్తానని, దీనికి సంబంధించిన ఫైలుపైనే తొలి సంతకం చేస్తానని ఊదరగొడుతున్నారు. యువతను ఆకర్షించే లక్ష్యంతో వారికి ఉద్యోగాల ఆశ కల్పించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. 2014లోనూ ఇలాగే రైతు రుణాలను బేషరతుగా మాఫీచేస్తానని, తొలి సంతకం దానిపైనే చేస్తానని నమ్మబలికారు. కానీ, రుణమాఫీ చేయకుండా తూతూమంత్రంగా ఏదో చేశామంటే చేశామనిపించడంతో చంద్రబాబు మాటలు నమ్మి పంట రుణాలు కట్టని రైతులను బ్యాంకులు ముప్పతిప్పలు పెట్టాయి. వారి రుణాలు పెరిగిపోయి అష్టకష్టాలు పడ్డారు. అలాగే, బెల్టు షాపులు రద్దుచేస్తామని చెప్పి తొలి సంతకం చేసినట్లు చెప్పినా ఆ పని చేయకపోయినా ప్రతి గ్రామంలోనూ బెల్టు షాపులను ఇంకా పెంచేశారు. ఇలా ఇచ్చిన ప్రతి హామీని బుట్టదాఖలు చేసిన బాబు మేనిఫెస్టో అమలులో సూపర్ ట్రాక్ రికార్డు ఉన్న వైఎస్సార్సీపీపై అడ్డగోలుగా విమర్శలు చేస్తుండడం గమనార్హం.వైఎస్సార్సీపీని కాపీ కొట్టేందుకే బాబు మేనిఫెస్టో ఆలస్యం..99 శాతం హామీలు అమలుచేసి మీకు మేలు జరిగితేనే నాకు ఓటేయాలని కోరుతున్న వైఎస్ జగన్ను ఒక్క హామీ కూడా అమలుచేయకుండా మోసం చేసిన చంద్రబాబు ప్రశ్నిస్తుండడాన్ని ప్రజలు వింతగా చూస్తున్నారు. ఇప్పటికే ముందస్తు మేనిఫెస్టో విడుదల చేసి ఆ తర్వాత కూడా ఎడాపెడా హామీలిచ్చిన చంద్రబాబు తుది మేనిఫెస్టోను ఒకట్రెండు రోజుల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నిజానికి ఇది ఎప్పుడో విడుదల చేయాల్సి వున్నా వైఎస్సార్సీపీ మేనిఫెస్టో కోసం ఎదురుచూశారు. తన మేనిఫెస్టోలో లేని అంశాలు అందులో ఏమైనా ఉంటే వాటిని కాపీ కొట్టే ఉద్దేశంతో ఆలస్యం చేశారు. గత ఎన్నికల్లో రూ.3 వేల పెన్షన్ హామీని అలాగే కాపీకొట్టి చివరి రెండు నెలలు ఇచ్చి ప్రజలను వంచించే ప్రయత్నం చేసినా ప్రజలు పట్టించుకోలేదు. ఇప్పుడు కూడా అదే ప్రయత్నంలో ఉండడం విశేషం. తాజాగా.. వైఎస్సార్సీపీ మేనిఫెస్టో విడుదలవడంతో తాను కూడా మేనిఫెస్టో ఇచ్చేందుకు చంద్రబాబు రెడీ అవుతున్నారు. ఈలోపు ఇంకేమైనా ఉంటే చెప్పాలని వాటిని మేనిఫెస్టోలో పెట్టేస్తానని చెబుతుండడంపై సాధారణ జనం నవ్వుకుంటున్నారు. -
మా మేనిఫెస్టోలో ఏమీ లేకపోతే భయమెందుకు బాబూ?
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ ఎన్నికల మేనిఫెస్టోలో ఏమీ లేకపోతే చంద్రబాబుకు అంత భయమెందుకని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి నిలదీశారు. సీఎం జగన్ను దూషించడమెందుకని ప్రశ్నించారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 99% అమలు చేసి మేనిఫెస్టోకు ప్రాముఖ్యత తెచ్చిన ఘనత వైఎస్ జగన్కే దక్కుతుందన్నారు. సీఎంను ఉద్దేశించి నిన్ను చంపేస్తే ఏమవుతుందని బాబు తాజాగా ఒక బహిరంగసభలో రంకెలేశారని గుర్తు చేశారు. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించాలన్నారు. ఆయన సభ్య సమాజంలో ఉండటానికి పనికిరాని వ్యక్తని ధ్వజమెత్తారు. బాబుకు అంతర్జాతీయంగా కిల్లర్ లైసెన్స్ ఇచ్చారేమోనని విరుచుకుపడ్డారు. మొన్న రాళ్లతో కొట్టండని ఆయన అనగానే విజయవాడలో సీఎం జగన్పై హత్యాయత్నం చేశారని గుర్తు చేశారు. రోజురోజుకూ దిగజారిపోతున్న ఆయనకు ఎన్నికల్లో ప్రజలు తగిన తీర్పు ఇవ్వడం ఖాయమన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సజ్జల ఆదివారం మీడియాతో మాట్లాడారు. చిన్న మెదడు చితికిందా బాబూ? గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ సీఎం వైఎస్ జగన్ అమలు చేయడంతో 2024 ఎన్నికల మేనిఫెస్టోపై అన్ని వర్గాల ప్రజల్లో చర్చ జరిగింది. ఇచ్చిన మాటపై నిలబడకపోతే రాజకీయాల్లోనే ఉండకూడదన్నది సీఎం వైఎస్ జగన్ సిద్ధాంతం. ప్రజల్లో విశ్వసనీయతను నిలబెట్టుకోవడానికే మేనిఫెస్టోను అత్యంత బాధ్యతాయుతంగా రూపొందించి, విడుదల చేశారు. బాబులా రోజూ ఆడిన అబద్ధమే మార్చి మార్చి చెబుతుంటే విశ్వసనీయత ఎలా వస్తుంది? వచ్చే ఐదేళ్లలో రాష్ట్రాన్ని, అన్ని వర్గాల ప్రజలను ఏ విధంగా ముందుకు తీసుకెళ్తామో చెప్పడమే మేనిఫెస్టో లక్ష్యం. అలా కాకుండా తాయిలాలతో అరచేతిలో వైకుంఠం చూపించేది మేనిఫెస్టో కాదు. వైఎస్ జగన్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మేనిఫెస్టోకి ఒక కొత్త అర్థం వచ్చింది. మేనిఫెస్టో అంటే ఇది అని ప్రజలు చెప్పుకుంటున్నారు. 2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలు చేసిన సీఎం జగన్ను.. పాత హామీలు ఏమయ్యాయంటూ 14 ఏళ్లు సీఎంగా ఉండి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన బాబు ప్రశ్నించడం విడ్డూరం. గత ఎన్నికల్లో సీఎం జగన్ 750 హామీలు ఇచ్చారని బాబు చెబుతుండటం చూస్తుంటే ఆయన చిన్న మెదడు చితికిపోయిందేమోనని అనిపిస్తోంది. 2014 ఎన్నికల్లో 600కిపైగా హామీలు ఇచ్చిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చిన 15 నిమిషాల్లోనే మేనిఫెస్టోను టీడీపీ వెబ్సైట్ నుంచి మాయం చేశారు. ఆ హామీల మాట దేవుడెరుగు.. ఇంటింటికీ ముఖ్యమైన హామీలు అంటూ లేఖలు పంపిన వాటిలోనూ ఒక్కటంటే ఒక్కటీ అమలు చేయకుండా మోసం చేశారు. ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి మద్యనిషేధానికి తూట్లు పొడిచిన బాబు ఇప్పుడు మద్యనిõÙధం గురించి మాట్లాడటం విడ్డూరం. మద్య నియంత్రణలో ప్రభుత్వం విజయం సాధించింది. సీపీఎస్ రద్దు చేయలేని పరిస్థితుల్లోనే ఉద్యోగుల సంక్షేమం కోసం జీపీఎస్ తెచ్చాం. మేనిఫెస్టోను చెత్తలో వేయడం చంద్రబాబుకు వెన్నుపోటుతో పెట్టిన విద్య మేనిఫెస్టో అంటే ప్రజలకు, నాయకుడికి, పార్టీకి మధ్య బంధం లాంటిది. నేను ఇది చేస్తాను అంటే చేసి చూపిస్తారనేలా ఉండాలి. ఎన్నికలు రాగానే అరచేతిలో వైకుంఠం చూపించి.. మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తానని చెప్పి..ఎన్నికలు అయ్యాక మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేయడం చంద్రబాబుకు వెన్నుపోటుతో పెట్టిన విద్య. 2019లో సీఎం జగన్ ఇచ్చిన హామీలను నిలుపుకున్నాక ప్రజలకు కూడా మేనిఫెస్టో సీరియస్నెస్ ఏంటో తెలుస్తోంది. మేనిఫెస్టోకు అర్థం వచ్చింది. ఇదే భావనపైనే మా ధీమా, మా నమ్మకం.అప్పుడు శ్రీలంకని.. ఇప్పుడు హామీలు ఇవ్వడం మోసం కాదా? సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక కరోనాతో రెండేళ్లు ఆర్థిక కష్టాలతోపాటు అదనపు ఖర్చుల రూపంలో రూ.60 వేల కోట్ల భారం పడింది. అయినా సరే అన్ని సంక్షేమ పథకాలను ఆపకుండా అమలు చేశారు. సచివాలయాలు, వలంటీర్ల ద్వారా అత్యంత పారదర్శకంగా పథకాలను అమలు చేస్తేనే ఏడాదికి రూ.70 వేల కోట్లు వ్యయమవుతోంది. ఇప్పుడు బాబు ఇస్తున్న హామీల అమలుకు ఏడాదికి రూ.1.50 లక్షల కోట్లు అవసరం. సీఎం బటన్ నొక్కుతూ రాష్ట్రాన్ని శ్రీలంకగా మార్చుతున్నారని ఆరోపించిన బాబే ఇప్పుడు ఏటా అదనంగా రూ.80 వేల కోట్లు వ్యయమయ్యే హామీలు ఇవ్వడం మోసం కాదా? ఎలాగూ అమలు చేసేది లేదు కదా అనే రోజుకో వాగ్ధానాన్ని బాబు ఇచ్చుకుంటూ పోతున్నారు. ఎన్నికల తేదీ నాటికి ఇంకెన్ని హామీలు ఇస్తారో.. వాటి అమలుకు ఏ రూ.2 లక్షల కోట్లు అవసరమవుతాయో కూడా తెలియడం లేదు. -
నాడు వ్యతిరేకించి.. ఇప్పుడు సమర్థిస్తున్నారు
డామన్/కటక్: రిజర్వేషన్లను ఆర్ఆర్ఎస్ మొదట్నుంచీ సమర్థిస్తూ వస్తోందంటూ ఆ సంస్థ చీఫ్ మోహన్ భాగవత్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. డయ్యూ డామన్, దాద్రా నగర్ హవేలీ కేంద్ర పాలిత ప్రాంతంలోని డామన్ పట్టణంలో శనివారం నిర్వహించిన ఎన్నికల ప్రచారర్యాలీలో రాహుల్ ప్రసంగించారు. ‘‘ ఇప్పుడేమో రిజర్వేషన్లకు మేం వ్యతిరేకం కాదని భాగవత్ చెబుతున్నారు. మరి అప్పుడేమో తాను రిజర్వేషన్లకు పూర్తి వ్యతిరేకినని ఘంటాపథంగా చెప్పేవారు.రిజర్వేషన్లను వ్యతిరేకించే వాళ్లే బీజేపీతో చేరేవారు. వాళ్లకే బీజేపీ స్వాగతం పలికి అక్కున చేర్చుకుంది. తీరా ఎన్నికల వేళ ఇప్పుడొచ్చి మళ్లీ రిజర్వేషన్లకు మా మద్దతు అంటూ భాగవత్ కొత్త రాగం ఆలపిస్తున్నారు’’ అని రాహుల్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘‘ఈసారి ఎన్నికలు కాంగ్రెస్, ఆర్ఎస్ఎస్–బీజేపీ మధ్య సైద్ధాంతిక పోరు. రాజ్యాంగ విత్తనం నుంచే దేశంలోని అనేక విభాగాలు ఉద్భవించాయి. పూర్వకాలంలో మాదిరి రాజ్యపాలన సాగించాలని మోదీజీ, ఆర్ఎస్ఎస్ ఆశ. వీటిని నాశనం చేసి ఆర్ఎస్–బీజేపీ రాజుల్లాగా దేశాన్ని పాలించాలనుకుంటున్నారు’’ అని ఆరోపించారు. ‘‘ ఆర్ఎస్ఎస్–బీజేపీ వాళ్లకు ఒకే దేశం, ఒకే భాష, ఒక్కడే నేత ఉండే వ్యవస్థ కావాలి. పశి్చమబెంగాల్ ప్రజలు బెంగాలీ మాట్లాడతారు. అలాగే గుజరాత్ వాళ్లు గుజరాతీ, తమిళులు తమిళమే మాట్లాడతారు. అలాంటపుడు ఒకే భాష, ఒకే నేత విధానంలో హేతుబద్ధత ఎక్కడుంది?’’ అని నిలదీశారు. ‘‘డయ్యూ డామన్, దాద్రా నగర్ హవేలీ కేంద్ర పాలిత ప్రాంత అడ్మిని్రస్టేటర్ పదవిలో మోదీ ప్రఫుల్ పటేల్ను ‘రాజు’లాగా నియమించారు. ప్రజాభీష్టంతో ప్రఫుల్కు పనిలేదు. ఆయన ఏమనుకున్నారో అదే చేస్తారు’’ అని ఆరోపించారు. -
బాద్షాల అరాచకాలు కన్పించ లేదా?
బెళగావి/సిర్సీ/దావణగెరె: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ప్రధాని నరేంద్ర∙మోదీ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. మన దేశానికి చెందిన రాజులు, మహారాజులను కించపర్చిన రాహుల్ నవాబులు, నిజామ్లు, సుల్తాన్లు, బాద్షాలు సాగించిన అరాచకాలపై మాత్రం నోరుమెదపడం లేదని మండిపడ్డారు. కేవలం బుజ్జగింపు, ఓటు బ్యాంకు రాజకీయాలతో లబ్ధి పొందడానికి రాహుల్ ఆరాటపడుతున్నారని ధ్వజమెత్తారు. ఆదివారం కర్ణాటకలోని బెళగావి, దావణగెరె, ఉత్తర కన్నడ జిల్లాలోని సిర్సీ, హోస్పేట్లో లోక్సభ ఎన్నికల ప్రచార సభల్లో ప్రధాని మోదీ మాట్లాడారు. మన దేశ చరిత్ర, స్వాతంత్య్ర పోరాట గాథలను కాంగ్రెస్ పార్టీ పాలనలో బుజ్జగింపు, ఓటు బ్యాంకు రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని రాశారని, ఆ పాపాన్ని రాహుల్ గాంధీ ఇప్పటికీ కొనసాగిస్తున్నారని విమర్శించారు. భారతదేశ రాజులు, మహారాజులు పేద ప్రజలపై క్రూరమైన అణచివేత, దౌర్జన్యాలకు పాల్పడ్డారని, ఆస్తులు, భూములు బలవంతంగా లాక్కున్నారంటూ రాహుల్ ఇటీవల ఆరోపించారని గుర్తుచేశారు. ఛత్రపతి శివాజీ, కిత్తూరు రాణి చెన్నమ్మ వంటి గొప్ప పాలకులను రాహుల్ అవమానించారని చెప్పారు. దేశ చరిత్రలో నవాబులు, నిజామ్లు, సుల్తాన్లు, బాద్షాలు సాగించిన అఘాయిత్యాలు, దారుణాల గురించి మాట్లాడాలంటే కాంగ్రెస్ రాజకుమారుడి నోటికి తాళం పడుతోందని ఎద్దేవా చేశారు. మొఘల్ రాజు ఔరంగజేబు మన ఆలయాలను అపవిత్రం చేశాడని, కూలి్చవేశాడని అన్నారు. అలాంటి ఔరంగజేబును ఆరాధించే పారీ్టలతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుందని ఆక్షేపించారు. ఔరంగజేబు దుశ్చర్యలపై రాహుల్ ఏనాడూ మాట్లాడలేదన్నారు. రాజులు, మహారాజులు మన దేశానికి ఎన్నో సేవలు చేశారని, వారి త్యాగాలు మరువలేమని పేర్కొన్నారు. రాజులకు వ్యతిరేకంగా మాట్లాడడానికి ఉన్న ధైర్యం సుల్తాన్లకు వ్యతిరేకంగా మాట్లాడడానికి రాహుల్కు లేదని విమర్శించారు. కాంగ్రెస్ ఓటు బ్యాంకు మైండ్సెట్ ఆ పార్టీ మేనిఫెస్టోలో కనిపిస్తోందని వెల్లడించారు. ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ) మద్దతు తీసుకుంటోందని ఆరోపించారు. వయనాడ్లో నెగ్గడానికి పీఎఫ్ఐకి లొంగిపోతారా? అని రాహుల్ని ప్రశ్నించారు. ప్రజల ఓట్లతోనే నాకు ధైర్యంఓటు బ్యాంకు రాజకీయాలు మరింత నీచంగా, విధ్వంసకరంగా తయారవుతున్నాయని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. అయోధ్యలో భవ్య రామమందిర నిర్మాణానికి కాంగ్రెస్ పార్టీ చివరి క్షణం వరకూ ఎన్నో అడ్డంకులు సృష్టించిందని ఆరోపించారు. ఆలయ నిర్మాణం జరగకుండా కాంగ్రెస్, దాని కోటరీ 70 ఏళ్లపాటు కుట్రలు సాగించాయని దుయ్యబట్టారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన మరుసటి రోజే అయోధ్యలో ఆలయ నిర్మాణంపై నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా, అప్పటి పాలకులు ఆ పని చేయలేదన్నారు. నిర్ణయం తీసుకొని, అమలు చేయడానికి 56 అంగుళాల ఛాతీ(మోదీ) కావాల్సి వచి్చందన్నారు. ప్రభుత్వ సొమ్ముతో గానీ, పన్ను చెల్లింపుదార్ల డబ్బుతో గానీ ఆ ఆలయం నిర్మించలేదని, శ్రీరాముడి భక్తుల విరాళాలతోనే ఆలయ నిర్మాణం జరిగిందని వివరించారు. రామమందిర ప్రాణప్రతిష్టకు హాజరు కావాలంటూ ఆహా్వనం అందజేస్తే కాంగ్రెస్తోపాటు కొన్ని పారీ్టలు తిరస్కరించాయని గుర్తుచేశారు. ఆ పార్టీలను ఎన్నికల్లో తిరస్కరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఎన్నికల్లో బీజేపీకి మద్దతు పలకాలని, మరింత బలం చేకూర్చాలని కోరారు.వారసత్వ పన్నును ఆమోదించను కాంగ్రెస్కు అధికారం అప్పగిస్తే వారసత్వ పన్నుతో ఆస్తులు పోగొట్టుకోవాల్సి వస్తుందంటూ ప్రజలను ప్రధానమంత్రి అప్రమత్తం చేశారు. పిల్లల కోసం ఆదా చేసుకున్న డబ్బులను సైతం లాక్కుంటారని చెప్పారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు 45 శాతం ఆస్తులను మాత్రమే బదిలీ చేసే అవకాశం ఉంటుందని, మిగతా 55 శాతం ఆస్తులను కాంగ్రెస్ ప్రభుత్వం స్వాధీనం చేసుకొని, ఓటు బ్యాంక్కు కట్టబెడుతుందని పేర్కొన్నారు. అయితే, తాను జీవించి ఉన్నంతకాలం ఇలాంటి వారసత్వ పన్ను ఆమోదించే ప్రసక్తే లేదని మోదీ తేలి్చచెప్పారు. మీ ఉద్దేశాలు వదిలేసుకోండి అంటూ కాంగ్రెస్ పారీ్టకి హితవు పలికారు. కర్ణాటకలో ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హిందువులపై దాడులు పెరిగిపోయాయని ప్రధానమంత్రి అన్నారు. 2014 కంటే ముందు బ్రోకర్ల రాజ్యం కొన్ని దేశాలు, సంస్థలు మన దేశం, మన ప్రభుత్వం బలహీనపడాలని కోరుకుంటున్నాయని, అలాగైతే లాభపడొచ్చని, ఆటలు సాగించుకోవచ్చని భావిస్తున్నాయని మోదీ చెప్పారు. భారత్ వేగంగా అభివృద్ధి చెందుతుండడం ఆయా దేశాలకు, సంస్థలకు ఇష్టం లేదన్నారు. భారత్ బలమైన దేశంగా ఎదగడం కొందరికి కంటగింపుగా మారిందన్నారు. బీజేపీ ప్రభుత్వం ఉంటే అవినీతికి పాల్పడడం, దోచుకోవడం సాధ్యం కాదని కొన్ని దుష్టశక్తులు భావిస్తున్నాయని పేర్కొన్నారు.2014 కంటే ముందు బ్రోకర్ల రాజ్యం నడిచిందని, ఢిల్లీ పవర్ కారిడార్లలో వారే అధికారం చెలాయించారని గుర్తుచేశారు. ఢిల్లీలోని హోటళ్లలో సంవత్సరాల తరబడి తిష్ట వేసి లాబీయింగ్ చేస్తూ ఉండేవారని తెలిపారు. 2014లో తాము అధికారంలోకి వచి్చన తర్వాత పవర్ కారిడార్లను శుద్ధి చేసే ప్రక్రియ చేపట్టామని వివరించారు. బ్రోకర్లకు, లాబీయిస్టులకు అక్కడ స్థానం లేకుండా చేశామని చెప్పారు. బీజేపీని అణగదొక్కడం సాధ్యం కాదన్న సంగతిని కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు తెలుసుకోవాలన్నారు. -
ఈసారి ఎవరు ?
సాక్షి, మేడ్చల్ జిల్లా: దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గంతో పాటు మినీ భారత్గా పేరొందిన మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో గెలుపు మూడు ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. 37 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అయితే ప్రధానంగా బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్, కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీతా మహేందర్రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి మధ్యనే పోటీ కొనసాగుతోంది. సీనియర్ నేత, మాజీ మంత్రి ఈటల అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్, గజ్వేల్ స్థానాల నుంచి పోటీ చేసి ఓటమి పాలైన సంగతి తెలిసిందే. పట్నం సునీత జెడ్పీ చైర్పర్సన్గా మూడు పర్యాయాలు పనిచేశారు. ఇక అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్లో చేరిన రాగిడి ఈసారి ఆ పార్టీ అభ్యగా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ముగ్గురు నేతలు కింది స్థాయి కార్యకర్తల పనితీరును సమన్వయం చేసుకుంటూ విజయమే లక్ష్యంగా ప్రచారంలో ముందుకు సాగుతున్నారు. దీంతో ప్రతి ఎన్నికల్లోనూ మార్పును ఆహా్వనించే మల్కాజిగిరి ఓటర్ల తీర్పుపై ఆసక్తి నెలకొంది.రేవంత్కు ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్ గెలుపుమల్కాజిగిరి సిట్టింగ్ స్థానం కావటంతో పాటు ఇక్కడ ఎంపీగా పని చేసిన సీఎం రేవంత్రెడ్డికి కాంగ్రెస్ గెలుపు ప్రతిష్టాత్మకంగా మారింది. వాస్తవానికి చేవెళ్ల నుంచి పోటీ చేసేందుకు సిద్ధమైన సునీతా మహేందర్రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం మల్కాజిగిరి టికెట్ కట్టబెట్టింది. మహిళ కావటం, పార్టీ అధికారంలో ఉండటం, ఇటీవల బీఆర్ఎస్ సహా ఇతర పా ర్టీ లకు చెందిన పలువురు నేతలు, ప్రజాప్రతినిధులు కాంగ్రెస్లో చేరటం ఆమెకు కలిసొచ్చే అంశాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.పైగా నియోజకవర్గంలోని నేతలందర్నీ సమన్వయం చేసే బాధ్యతను స్వయంగా రేవంత్రెడ్డి తీసుకోవటంతో సునీత విజయావకాశాలు మెరుగయ్యాయని అంటున్నారు. లోక్సభ సెగ్మెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సమన్వయ కమిటీలను ఏర్పాటు చేయగా నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే హన్మంతరావు కనుసన్నల్లో ఎన్నికల ప్రచారం సాగుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై గెలుపు భారం అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గం పరిధి లో 7 అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థు లు గెలుపొందారు. కంట్మోనెంట్ ఎమ్మెల్యే ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో అక్కడ పార్లమెంట్ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఉప ఎన్నిక కూడా జరుగుతోంది. దీంతో ఇక్కడ గెలుపు బీఆర్ఎస్కు ప్రతిష్టాత్మకంగా మారింది. పా ర్టీ కి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు రాగిడి గెలుపు కోసం అంత చురుగ్గా వ్యవహరించటం లేదని పార్టీ వర్గాల్లోనే విమర్శలు విన్పిస్తున్నాయి. బీఆర్ఎస్ టికెట్ దక్కించుకోవటంలో విజయం సాధించిన రాగిడి లక్ష్మారెడ్డి పా ర్టీ లో నెలకొన్న అనిశ్చితిని తొలగిస్తేనే విజయం సాధ్యమవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 7 అసెంబ్లీ నియోజకవర్గా ల్లో పార్టీ బలంగా ఉండటంతో బీఆర్ఎస్ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నియోజకవర్గం పరిధిలో పలు సమావేశాలకు హాజరవుతూ కేడర్ ప్రచారంలో పాల్గొనేలా ఉత్సాహపరుస్తున్నారు. రాగిడి కూడా భారీ ర్యాలీలతో వాతావరణాన్ని వేడెక్కిస్తున్నారు. విజయమే లక్ష్యంగా బీజేపీ వ్యూహం బీజేపీ టికెట్ ఈటలను వరించటం ఓ అనూహ్య పరిణామమని చెప్పవచ్చు. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నేతగా పేరున్నప్పటికీ, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన రెండు స్థానాల్లో ఈటల ఓటమి పాలయ్యారు. అయితే పార్లమెంటు ఎన్నికలనేవి అనేక అంశాలపై ఆధారపడి జరిగేవి కావడం, ప్రధాని మోదీ చరిష్మా, హిందూత్వ నినాదం, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అండదండలు కలిసివచ్చే అంశాలుగా భావించవచ్చు. పా ర్టీ లోని క్రియాశీలకమైన నాయకుల తోడ్పాటు సానుకూల అంశంగా చెప్పవచ్చు. ఇప్పటికే ప్రధాని మోదీ ఇక్కడ రోడ్ షో నిర్వహించటం, పలువురు కేంద్ర మంత్రులు కూడా స్థానికంగా ఎన్నికల సభల్లో పాల్గొని కేడర్ను ఉత్తేజితులను చేయటం గెలుపునకు అనుకూలతగా పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఈటల కూడా సామాజిక వర్గాల వారీగా ఆత్మీయ సమ్మేళనాల్లో విస్తృతంగా పాల్గొంటూ ఎన్నికల ప్రచారాన్ని వేడేక్కిస్తున్నారు. కార్మికుల ఓట్లూ కీలకం! ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను కంట్మోనెంట్ మినహాయించి ఉప్పల్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి, మేడ్చల్, ఎల్బీనగర్ పరిధిలోని జీడిమెట్ల, బాలానగర్, శామీర్పేట్, మేడ్చల్, కుషాయిగూడ, చర్లపల్లి, మౌలాలి, నాచారం, మల్లాపూర్, ఉప్పల్ ప్రాంతాల్లో పారిశ్రామికవాడలున్నాయి. ప్రభుత్వ రంగ పరిశ్రమలతో పాటు ప్రైవేటులో ఇంజనీరింగ్, ఫార్మా, ఫుడ్ ఇండస్ట్రీలు ఉన్నాయి. మౌలాలి ప్రాంతంలో ఫ్యాబ్రికేషన్, స్టీల్, ప్లాస్టిక్ ఫరి్నచర్, కెమికల్, ఎల్రక్టానిక్స్ తరహా పరిశ్రమలు ఉన్నాయి. కోకాకోలా కంపెనీల్లో కూడా కార్మికులు, ఉద్యోగులు ఉపాధి పొందుతున్నారు. బాలానగర్ పారిశ్రామికవాడ పరిధిలో ఫ్యాన్లు తయారు చేసే కంపెనీలు, ఆటోమొబైల్ వస్తువుల తయారీ, బీర్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్, ఫాబ్రికేషన్, వైర్ మెష్ యూనిట్లు, ఫుడ్ ప్రొడక్ట్స్, ఫార్మా యూనిట్లు తదితర కంపెనీలు ఉన్నాయి. ఐడీఏ బాలానగర్, ఐడీఏ కూకట్పల్లి, సీఐఈ గాంధీనగర్ ఒకే చోట ఉన్నాయి. శామీర్పేట్, మేడ్చల్ మండలాల్లో బయెటెక్, కెమికల్, ఇతర చిన్నతరహా పరిశ్రమలు ఉన్నాయి. గుండ్లపోచంపల్లిలో అపరెల్ టెక్స్టైల్ పార్కు ఉంది. తుర్కపల్లిలో ఐసీఐసీఐ నాలెడ్జి కంపెనీ పేరుతో పరిశ్రమల హబ్ ఏర్పడ్డాయి. ఘట్కేసర్, కీసరలలో కూడా చిన్న కంపెనీలు, వందలాది పరిశ్రమలు ఉన్నాయి. దీంతో ఈ పరిశ్రమల్లో పని చేసే కార్మికుల ఓట్లపై కూడా ప్రధాన పా ర్టీ ల అభ్యర్థుల గెలుపు ఓటములు ఆధారపడి ఉన్నాయనే చర్చ సాగుతోంది. ఇక్కడ గెలిస్తే మంచి భవిష్యత్తు!మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం పలువురు రాజకీయ నాయకులకు పునర్జన్మనిచ్చిందనటంలో అతియోశక్తి లేదు. ఇక్కడ ఎంపీగా గెలుపొందిన నేతలకు తమ పార్టీలో అత్యున్నత పదవులు దక్కడమే కాకుండా పాలనా పరంగా ముఖ్యమంత్రిగా, కేంద్ర, రాష్ట్ర మంత్రులుగా పని చేసే అవకాశం లభించింది. అదే సమయంలో ఇక్కడ పోటీ చేసి ఓడిపోయిన నాయకులకు కూడా రాజకీయ రంగంలో మేలు జరిగిందనే అభిప్రాం కూడా ఉండటం గమనార్హం. 2009లో కాంగ్రెస్ తరఫున గెలుపొందిన సర్వే సత్యనారాయణకు కేంద్రమంత్రి వర్గంలో స్థానం దక్కింది. 2014లో టీడీపీ తరఫున గెలుపొందిన చామకూర మల్లారెడ్డి తన పదవీ కాలం పూర్తి చేసుకోక ముందే మేడ్చల్ అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొంది మంత్రి వర్గంలో చోటు దక్కించుకున్నారు. మహబూబ్నగర్ జిల్లా కొడంగల్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయిన రేవంత్రెడ్డి 2019 పార్లమెంట్ ఎన్నికల్లో అనూహ్యంగా మల్కాజిగిరి నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. తదనంతరం టీపీసీసీ అధ్యక్ష పదవిని దక్కించుకున్నారు. అలాగే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ కొడంగల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలుపొందిన రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఒక్కసారి కూడా మంత్రిగా పని చేయని రేవంత్రెడ్డి ఏకంగా సీఎం కావటానికి మల్కాజిగిరి నియోజకవర్గ సెంటిమెంటే కారణమని స్థానికులు చర్చించుకుంటూ ఉంటారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన మాజీ మంత్రి సీహెచ్ మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్రెడ్డి..ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజిగిరి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందడాన్ని కూడా స్థానికులు ప్రస్తావిస్తూ ఉంటారు.
Advertisement
Photos
View allVideo
View allఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సేద్యంలో సేవలకు సలాం
అక్రమాల ప్రియ
ప్రజల మనిషి జగన్
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
దశాబ్దాల కల నెరవేరిన వేళ...
హామీలెవరూ నమ్మట్లేదు! గతంలో చెప్పినట్లు ఇవి కూడా అబద్ధాలనుకొని వెళ్లిపోతున్నార్సార్!
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
సంక్షేమ సిరిమల్లిక
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
Bullet List Block
- భారతమాత కుమార్తెగా అభ్యర్థిస్తున్నాను: రోడ్షోలో సునీతా కేజ్రీవాల్
- ‘మీరు కావాల్సినంత పాన్ తిన్నారుగా’.. ఒడిశాలో కాంగ్రెస్దే అధికారం
- అసభ్యకర వీడియోల దుమారం.. దేవెగౌడ మనవడిపై కేసు నమోదు
- బీజేపీ ఏం చేసినా ఈసీ పట్టించుకోదు.. ఆప్ ఊపిరి పీల్చుకున్నా నోటీసులు
- T20 WC: వసీం జాఫర్ జట్టు ఇదే.. అతడికి మొండిచేయి!
- మోరాయించిన ప్రముఖ యాప్.. మీమ్స్ వైరల్!
- ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
What’s your opinion
is snake reptile?
What is your fav car
ముంబై కెప్టెన్గా హార్దిక్ పాండ్యా నియామకం సరైందేనా?
AP : కూటమి మ్యానిఫెస్టోపై ఏమనుకుంటున్నారు?
నమ్మశక్యం కాని వాగ్దానాలిస్తారు
ఏ పార్టీకి నచ్చిన వాగ్దానాలు వారిస్తారు
Advertisement