ముండే కుమార్తెల ఘన విజయం | Munde daughters' success | Sakshi
Sakshi News home page

ముండే కుమార్తెల ఘన విజయం

Oct 20 2014 1:57 AM | Updated on Mar 29 2019 9:24 PM

ముండే కుమార్తెల ఘన విజయం - Sakshi

ముండే కుమార్తెల ఘన విజయం

మహారాష్ట్ర అసెంబ్లీతోపాటు లోక్‌సభ ఉప ఎన్నికలో దివంగత బీజేపీ నేత గోపీనాథ్ ముండే కుమార్తెలు పంకజ, ....

ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీతోపాటు లోక్‌సభ ఉప ఎన్నికలో దివంగత బీజేపీ నేత గోపీనాథ్ ముండే కుమార్తెలు పంకజ, ప్రీతమ్‌లు విజయం సాధించారు. పంకజా పర్లి అసెంబ్లీ స్థానం నుంచి ఎన్సీపీ అభ్యర్థిపై 25 వేల ఓట్ల మెజారిటీతో గెలవగా ప్రీతమ్ తన తండ్రి మరణంతో ఖాళీ అయిన  బీడ్ లోక్‌సభ స్థానం నుంచి లోక్‌సభ చరిత్రలోకెల్లా రికార్డు విజయం సాధించారు. 6,96,321 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థిపై గెలిచారు. ఆమెకు 9,22,416 ఓట్టొచ్చాయి.  ఇప్పటి వరకూ ఈ రికార్డు బెంగాల్ నుంచి 2004లో 5,92,502 ఓట్ల తేడాతో గెలిచిన సీపీఎం నేత అనిల్ పేరిట ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement