'అమ్మా.. నేను సూసైడ్ మిషన్లో ఉన్నాను' | 'I Am On A Suicide Mission', a Terrorist Told His Mother On Phone | Sakshi
Sakshi News home page

'అమ్మా.. నేను సూసైడ్ మిషన్లో ఉన్నాను'

Jan 3 2016 9:32 AM | Updated on Nov 6 2018 8:04 PM

'అమ్మా.. నేను సూసైడ్ మిషన్లో ఉన్నాను' - Sakshi

'అమ్మా.. నేను సూసైడ్ మిషన్లో ఉన్నాను'

పంజాబ్ లోని పఠాన్కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రదాడికి కొన్ని గంటల ముందు ఓ టెర్రరిస్ట్ తన తల్లికి చేసిన కాల్ వివరాలు తెలిసి అధికారులు అశ్యర్యపోయారు.

చండీగఢ్: పంజాబ్ లోని పఠాన్కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రదాడికి కొన్ని గంటల ముందు ఓ టెర్రరిస్ట్ తన తల్లికి చేసిన కాల్ వివరాలు తెలిసి అధికారులు అశ్యర్యపోయారు. అర్థరాత్రి 1:58 గంటలకు వచ్చిన ఈ 70 సెకన్ల కాల్ రికార్డ్ వివరాలను అధికారులు సేకరించారు. అయితే, ఈ వివరాలపై స్పష్టత లేకపోవడంతోనే వైమానిక స్థావరంపై దాడులు జరగకుండా అప్రమత్తం కాలేకపోయినట్లు తెలుస్తోంది. టెర్రరిస్ట్ తన తల్లితో ఫోన్లో మాట్లాడుతూ.. 'నేను సూసైడ్ మిషన్లో ఉన్నాను. అల్లా మిమ్మల్ని చల్లగా చూస్తాడు' అని చెప్పినట్లు తెలుస్తోంది. పాకిస్థాన్ నుంచి అర్ధరాత్రి 12:30 గంటల నుంచి 2 గంటల వరకు వచ్చిన కాల్స్ వివరాలను డీకోడ్ చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

టెర్రరిస్టులు ఫోన్లో పంజాబీ, ముల్తానీ భాషల్లో మాట్లాడినట్లు అధికారులు తెలిపారు. 87 సెకన్లపాటు జరిగిన ఓ కాల్ సంభాషణలో.. అంతా కంట్రోల్లో ఉందా అని ఓ వ్యక్తి అడగగా, అవును అని ఫోన్లో అవతలి వ్యక్తి సమాధానమిచ్చినట్లు గుర్తించారు. ఎయిర్ ఫోర్స్ ఆస్తులు, చాపర్స్, ఇతర విమానాలను ధ్వంసం చేయడమే లక్ష్యంగా ఉగ్రవాదులు ఈ దాడులకు పాల్పడినట్లు అధికారులు భావిస్తున్నారు.   శనివారం చోటుచేసుకున్న ఉగ్రదాడులు, భారత బలగాల ఎదురుకాల్పుల ఫలితంగా ముగ్గురు ఎయిర్ ఫోర్స్ సిబ్బంది చనిపోగా, నలుగురు తీవ్రవాదులు హతమైన విషయం అందరికీ తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement