24 గంటల్లో 3,277 కేసులు.. 128 మరణాలు

CoronaVirus: 3227 More Positive Cases Registered In India - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా విలయం ఏ మాత్రం తగ్గడం లేదు. కేంద్రం లాక్‌డౌన్‌ పొడిగించినా, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టు దిట్టమైన చర్యలు తీసుకుంటున్నా కరోనా పాజిటివ్‌ల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 3277 కొత్త పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 128 మంది కరోనా బారిన పడి ప్రాణాలు వదిలారు. ఈ మేరకు కేంద్రం ఆదివారం ఉదయం కరోనా హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. ఇప్పటివరకు దేశంలో 62939 మందికి కరోనా సోకగా.. 2109 మంది మరణించారు. 19,359 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 41472 కరోనా యాక్టీవ్‌ కేసులు ఉన్నాయి.  

చదవండి:
మనమంతా రెండో ఇన్నింగ్స్‌ ఆడుతున్నాం
కరోనా: తెలంగాణలో మరో 31 పాజిటివ్‌

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top