కశ్మీర్‌లో ఆర్మీ వాహనంపై రాళ్లవర్షం

 Civilian killed, 3 wounded as Army allegedly fires on protestors - Sakshi

పుల్వామా/శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఆందోళనకారులు రెచ్చిపోయారు. గస్తీకి వెళ్లివస్తున్న ఆర్మీ వాహనంపై రాళ్లవర్షం కురిపించారు. దీంతో తొలుత హెచ్చరించిన అనంతరం ఆర్మీ అధికారులు గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోగా, మరో బాలికకు తీవ్రగాయాలయ్యాయి. ఈ విషయమై ఆర్మీ అధికార ప్రతినిధి మాట్లాడుతూ..నౌపొరా ప్రాంతంలో రాంగ్‌ పార్కింగ్‌ కారణంగా ట్రాఫిక్‌ నిలిచిపోవడంతో ఆ వాహనాలను పక్కకు తీయాలని కోరేందుకు ఆర్మీ అధికారులు వాహనం దిగారని,ఆందోళనకారులు పెద్దసంఖ్యలో అక్కడకు చేరుకుని ఆర్మీ వాహనంపై రాళ్లదాడికి పాల్పడ్డారని వెల్లడించారు. మరోవైపు కశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి పేట్రేగిపోయారు. శ్రీనగర్‌లోని కక్‌ సరాయ్‌ ప్రాంతంలో శుక్రవారం వాహనాల తనిఖీలు చేపడుతున్న భద్రతాబలగాలు లక్ష్యంగా కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఇద్దరు పోలీసులతో పాటు ముగ్గురు పౌరులు గాయపడినట్లు పోలీస్‌ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top