పార్లమెంటు సమయంలో సమ్మె చేస్తాం

Bank, insurance firm unions threaten nationwide stir over govt policies - Sakshi

చెన్నై: బ్యాంకింగ్, బీమా రంగాల్లో అనుసరిస్తున్న విధానాలను కేంద్రం సమీక్షించకుంటే డిసెంబర్‌లో పార్లమెంటు సమావేశాల సందర్భంగా సమ్మెకు దిగుతామని బ్యాంకులు, బీమా సంఘాలు హెచ్చరించాయి. ఈ మేరకు ది కోఆర్డినేషన్‌ కమిటీ ఆఫ్‌ బ్యాంక్, ఇన్సూరెన్స్‌ అండ్‌ ఫైనాన్స్‌ సెక్టార్‌ యూనియన్స్‌(సీసీబీఐఎఫ్‌యూ) చైర్మన్‌ సీహెచ్‌ వెంకటాచలం ఓ ప్రకటనను విడుదల చేశారు.

‘ఒకవేళ కేంద్ర ప్రభుత్వం బీమా, బ్యాంకింగ్‌ రంగాల్లో ప్రస్తుతం పాటిస్తున్న విధానాలను సమీక్షించకుంటే ఈ ఏడాది డిసెంబర్‌లో పార్లమెంటు సమావేశాల సందర్భంగా సమ్మెకు దిగుతాం. ప్రస్తుతం ప్రభుత్వరంగ బ్యాంకుల వద్ద రూ.115 లక్షల కోట్ల నగదు ఉంది. ఇదంతా సామాన్యులది. ప్రస్తుతం ప్రభుత్వరంగ బ్యాంకులు కేవలం నిరర్ధక ఆస్తుల సమస్యను ఎదుర్కొంటున్నాయి. ఒకవేళ ప్రభుత్వం బ్యాంకుల్ని ప్రైవేటీకరిస్తే.. ఈ మొత్తం పెట్టుబడిదారుల చేతుల్లోకి వెళ్లిపోతుంది’ అని వెంకటాచలం తెలిపారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top