'చవకబారు ప్రచారం కోసం వెంపర్లాడుతున్నాడు' | Aravind Kejriwal wants cheap popularity: V.Narayanasamy | Sakshi
Sakshi News home page

'చవకబారు ప్రచారం కోసం వెంపర్లాడుతున్నాడు'

Feb 14 2014 3:43 PM | Updated on Aug 20 2018 3:46 PM

'చవకబారు ప్రచారం కోసం వెంపర్లాడుతున్నాడు' - Sakshi

'చవకబారు ప్రచారం కోసం వెంపర్లాడుతున్నాడు'

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ పై కేంద్ర మంత్రి వి. నారాయణ స్వామి తీవ్రస్థాయిలో మండిపడ్డారు

న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ పై కేంద్ర మంత్రి వి. నారాయణ స్వామి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చవకబారు ప్రచారం కోసమే కేజ్రివాల్ వెంపర్లాడుతున్నారని.. అందులో భాగంగానే జనలోక్ పాల్ బిల్లు కోసం పట్టుపడుతున్నారని ఆయన విమర్శించారు. 
 
కేంద్రమంత్రా లేక రాష్ట్ర మంత్రా అనే విషయాన్ని పక్కన పెట్టి ప్రతి ఒక్కరు రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలని ఆయన అన్నారు. చట్టాన్ని గౌరవించడం నేర్చుకోవాలి. 
 
నిబంధనల ప్రకారం నడుచుకోవాలని ఆయన హితవు పలికారు. అరవింద్ కేజ్రివాల్ చవకబారు ప్రచారం మానుకొని.. ముఖ్యమంత్రిగా వ్యవహరించాలని నారాయణస్వామి సూచించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement