breaking news
V.Narayanasamy
-
ముఖ్యమంత్రికి షాకిచ్చిన కిరణ్ బేడి
-
ముఖ్యమంత్రికి షాకిచ్చిన కిరణ్ బేడి
పుదుచ్చేరి: ఢిల్లీలో మొన్నటివరకు మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్- సీఎం అరవింద్ కేజ్రీవాల్ మధ్య బాహాటంగా ఘర్షణ తలెత్తిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే తరహా పరిస్థితి మరో కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో పునరావృతం అవుతుందా? అంటే పరిస్థితులు ఔననే సంకేతాలు ఇస్తున్నాయి. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడి ఆ ప్రాంత ముఖ్యమంత్రి వీ నారాయణస్వామికి తాజ్ షాక్ ఇచ్చారు. ఆయన జారీచేసిన ఆదేశాలను రద్దు చేశారు. అధికారిక కార్యకలాపాల కోసం సోషల్ మీడియాను వినియోగించకుండా నిషేధం విధిస్తూ సీఎం నారాయణస్వామి ఆదేశాలు జారీచేయగా.. ఆ ఆదేశాలు చెల్లవంటూ కిరణ్ బేడీ స్పష్టం చేశారు. సీఎం నారాయణస్వామిది కాంగ్రెస్ పార్టీ కాగా.. బీజేపీ కిరణ్బేడిని లెఫ్టినెంట్ గవర్నర్గా నామినేట్ చేసిన సంగతి తెలిసిందే. -
'చవకబారు ప్రచారం కోసం వెంపర్లాడుతున్నాడు'
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ పై కేంద్ర మంత్రి వి. నారాయణ స్వామి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చవకబారు ప్రచారం కోసమే కేజ్రివాల్ వెంపర్లాడుతున్నారని.. అందులో భాగంగానే జనలోక్ పాల్ బిల్లు కోసం పట్టుపడుతున్నారని ఆయన విమర్శించారు. కేంద్రమంత్రా లేక రాష్ట్ర మంత్రా అనే విషయాన్ని పక్కన పెట్టి ప్రతి ఒక్కరు రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలని ఆయన అన్నారు. చట్టాన్ని గౌరవించడం నేర్చుకోవాలి. నిబంధనల ప్రకారం నడుచుకోవాలని ఆయన హితవు పలికారు. అరవింద్ కేజ్రివాల్ చవకబారు ప్రచారం మానుకొని.. ముఖ్యమంత్రిగా వ్యవహరించాలని నారాయణస్వామి సూచించారు.