
బాబాయ్-అబ్బాయ్ రాజీ
సమాజ్వాదీ పార్టీలో సంక్షోభానికి తెరపడింది. బాబాయ్ శివపాల్ యాదవ్కు గతంలోని మంత్రిత్వ శాఖల్ని తిరిగి కేటాయించామని,
ములాయం జోక్యంతో ఎస్పీలో ముగిసిన సంక్షోభం
శివపాల్కు పాత శాఖలు
కేబినెట్లోకి మళ్లీ ప్రజాపతి
లక్నో: సమాజ్వాదీ పార్టీలో సంక్షోభానికి తెరపడింది. బాబాయ్ శివపాల్ యాదవ్కు గతంలోని మంత్రిత్వ శాఖల్ని తిరిగి కేటాయించామని, కేబినెట్ నుంచి తప్పించిన గాయత్రి ప్రజాపతిని తిరిగి మంత్రివర్గంలోకి తీసుకున్నామని సీఎం అఖిలేశ్ యాదవ్ శుక్రవారం ట్వీట్ చేశారు. బాబాయ్-అబ్బాయ్ మధ్య ఆధిపత్య పోరుతో దెబ్బతిన్న పార్టీ ప్రతిష్టను చక్కదిద్దేందుకు అధినేత ములాయం సింగ్ యాదవ్ శుక్రవారం రంగంలోకి దిగారు. తను ఉన్నంతవరకూ ఎలాంటి చీలికలు ఉండకూడదన్నారు.
అఖిలేశ్ తన మాటకు అడ్డుచెప్పడని, గనుల శాఖ మాజీ మంత్రి గాయత్రి ప్రజాపతిని తిరిగి యూపీ కేబినెట్లోకి తీసుకుంటామంటూ అంతకముందు పార్టీ శ్రేణులకు చెప్పారు. ‘మాకు పెద్ద కుటుంబం ఉంది. అభిప్రాయభేదాలు వస్తుంటాయి. శివ్పాల్, అఖిలేశ్ మధ్య ఏ గొడవా లేదు’ అని తెలిపారు.
ప్రస్తుతం ఎన్నికల సమయమని, కలిసికట్టుగా పనిచేసేందుకు అందరూ ముందుకు సాగాలని పేర్కొన్నారు. సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించడంతో తాను బాధపడ్డానని అఖిలేశ్ పేర్కొన్నారు. లక్నోలో ములాయంతో తమ్ముడు శివ్పాల్ 15 నిమిషాలు భేటీ కాగా, వెంటనే అఖిలేశ్ తండ్రితో చర్చించారు.