బాధ్యతలు స్వీకరించిన అచల్‌ కుమార్‌ జోతి | achal kumar joti takes charge as the chief election commissioner | Sakshi
Sakshi News home page

బాధ్యతలు స్వీకరించిన అచల్‌ కుమార్‌ జోతి

Jul 6 2017 12:35 PM | Updated on Sep 5 2017 3:22 PM

21వ భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా అచల్ కుమార్ జోతి బాధ్యతలు స్వీకరించారు.

న్యూఢిల్లీ:  21వ భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా అచల్ కుమార్ జోతి గురువారం బాధ్యతలు స్వీకరించారు.  వచ్చే ఏడాది జనవరి 17 వరకు ఆయన సీఈసీగా కొనసాగుతారు. సీఈసీ, ఈసీల పదవీ కాలం ఆరేళ్లు లేదా 65 ఏళ్ల వయసు. రెండిటిలో ఏది ముందు వస్తే దాన్నే పరిగణ లోకి తీసుకొంటారు. జనవరి 23,1953లో జన్మించిన అచల్ కుమార్ 1975 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి గుజరాత్ కేడర్‌కు చెందిన వారు. నదీం జైదీ పదవీ కాలం నిన్నటితో ముగిసిన విషయం తెలి
సిందే.

 

Advertisement
 
Advertisement
Advertisement