సమ్మెకు దిగనున్న బ్యాంకు ఉద్యోగులు | 10 Lakh Bankers To Go On Strike On July 29 | Sakshi
Sakshi News home page

సమ్మెకు దిగనున్న బ్యాంకు ఉద్యోగులు

Jul 13 2016 1:35 PM | Updated on Sep 4 2017 4:47 AM

ప్రభుత్వం అనుసరిస్తున్న బ్యాంకింగ్ రంగ వ్యతిరేక విధానాలకు నిరసనగా సమ్మెకు దిగనున్నట్టు ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ) జెనరల్ సెక్రెటరీ సీహెచ్ వెంకటాచలమ్ తెలిపారు.

చెన్నై: దేశంలోని 10 లక్షల బ్యాంకు ఉద్యోగులు ఈనెల 29 నుంచి సమ్మెకు దిగనున్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న బ్యాంకింగ్ రంగ వ్యతిరేక విధానాలకు నిరసనగా సమ్మెకు దిగనున్నట్టు ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ) జెనరల్ సెక్రెటరీ సీహెచ్ వెంకటాచలమ్ తెలిపారు. దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు ఈ సమ్మెలో పాల్గొంటాయని ఆయన తెలిపారు. తొమ్మిది యూనియన్ల లో సభ్యత్వం కలిగిన దాదాపు 10 లక్షల మంది ఇందులో పాల్గొననున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement