‘ఈ జోకర్లు పరువు తీస్తున్నారే!’

RGV Tweets on TDP MPs - Sakshi

సాక్షి, సినిమా : పార్లమెంట్‌ సాక్షిగా టీడీపీ ఆడుతున్న డ్రామాలు బహుశా దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మకు బాగా చికాకు పుట్టించాయేమో. వారిపై వెటకారంగా ఆయన చేసిన ట్వీట్లు వైరల్‌ అవుతున్నాయి. 

‘ఇలాంటి జోకర్లు ఏపీ ప్రజలకు ప్రతినిధులుగా ఎన్నిక కావటం చూస్తున్న నరేంద్ర మోదీ బహుశా ఏపీని ఓ జోక్‌గా భావిస్తున్నాడేమో. వీరు జోకర్లకు తక్కువ’ అంటూ... అర్థం కానీ రీతిలో ఏదో తూటానే వర్మ పేల్చాడు. ఇక మరో ట్వీట్‌లో ‘టీడీపీ చెందిన వీళ్లు అంతర్జాతీయ స్థాయిలో గౌరవం ఉన్న తెలుగు దేశం పార్టీ పరువును జాతీయ స్థాయిలో అవమానానికి గురి చేస్తున్నారు’ అంటూ వెటకారంగా మరో ట్వీట్‌ చేశాడు’ 

అధికార పక్షంలో ఉండి కూడా హోదాను సాధించలేకపోతున్న టీడీపీ.. మరో వైపు కూటమి నుంచి బయటకు వచ్చి పోరాటం చేయకుండా వేషాలు వేస్తోంది. ఈ క్రమంలో కేంద్రంపై ఒత్తిడి పెంచుతున్నామనే డ్రామాలు వర్మకు నచ్చక ఇలా ట్వీట్లు చేశాడన్న మాట. కాగా, గతంలో కూడా వర్మ ఏపీ హోదాపై పలు ట్వీట్లు చేసిన విషయం తెలిసిందే.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top