అమెరికాలో కాల్పుల కలకలం..!
చికాగో : చికాగోలో కాల్పుల ఘటన కలకలం రేపింది. ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ఐదుగురు మృతి చెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు ఎదురుకాల్పులు జరిపి ఆ ఉన్మాదిని మట్టుబెట్టారు. చికాగోకు కొద్ది మైళ్ల దూరంలో ఉన్న అరోరాలోని ఓ ఫ్యాక్టరీలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.