వరదల్లో 200 మంది మృతి | Colombia landslides: Over 200 die in Putumayo floods | Sakshi
Sakshi News home page

వరదల్లో 200 మంది మృతి

Apr 2 2017 3:36 PM | Updated on Sep 5 2017 7:46 AM

వరదల్లో 200 మంది మృతి

వరదల్లో 200 మంది మృతి

పుటమయో ప్రావిన్స్‌లో భారీ వర్షాలకు కొండచరియలు విరిగి పడి సుమారు 200 మంది మృతిచెందారు.

బోగోటా(కొలంబియా): పుటమయో ప్రావిన్స్‌లో భారీ వర్షాలకు కొండచరియలు విరిగి పడి సుమారు 200 మంది మృతిచెందారు. మరో 200 మంది తీవ్రంగా గాయపడ్డారు. వందల కుటుంబాలు సర్వం కోల్పోయి నిరాశ్రయులయ్యారు. సుమారు 25 ఇళ్లు పూర్తి ధ్వంసమయ్యాయి.

శుక్రవారం రాత్రి ఒక్క రోజే 130 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావడం వల్ల ఆ ప్రాంతంలో నదులు పొంగి ప్రవహిస్తోన్నాయి.  కొన్ని చోట్ల కార్లు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాయి. దీంతో కొలంబియా ప్రెసిడెంట్‌ జువన్‌ మాన్యుల్‌ సాంటోస్‌ ఎమర్జెన్సీని ప్రకటించాడు.
 

Advertisement
 
Advertisement
Advertisement