-117 మంది మృతి
- వందలాది మంది గల్లంతు
- గ్రీస్ తీరంలో ఘటన
ఎథెన్స్: మధ్యధరా సముద్రంలో మరణ ఘోష వినిపిస్తూనే ఉంది. స్వదేశాల్లో యుద్ధంతో భీతిల్లి పొట్ట చేతపట్టుకొని యూరప్ దేశాలకు పయనమవుతున్న శరణార్థులు ఆటుపోట్లకు బలవుతున్న విషాద ‘సాగర’గాథ కొనసాగుతూనే ఉంది. తాజాగా మధ్యధరా సముద్రాన్ని దాటే క్రమంలో గ్రీస్ తీరంలో బోటు బోల్తా పడి వందలాది గల్లంతయ్యారు. వారిలో 117 మంది మృతదేహాలు లిబియాలోని జువారా తీరానికి గురువారం కొట్టుకువచ్చాయి. క్రీట్ ద్వీపం దగ్గర్లో పడవ మునిగిందని, కిక్కిరిసిన పడవలో సామర్థ్యానికి మించి 125 మంది వరకు ఉండవచ్చని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని లిబియా నేవీ ప్రతినిధి కల్నల్ అయూబ్ ఖాసీం తెలిపారు.
ఎవరెవరు ఏఏ దేశాలకు చెందినవారో ఇంకా గుర్తించాల్సి ఉందన్నారు. బోటు ఎప్పుడు మునిగిందన్నదీ చెప్పలేకపోతున్నారు. కొన్ని శవాలు కుళ్లిపోయున్నాయి. గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారు. గ్రీస్ కోస్ట్ గార్డ్స్ 340 మందిని రక్షించారు. నాలుగు మృతదేహాలను గుర్తించినట్టు అంతర్జాతీయ వలసల సంస్థ (ఐఓఎం) ప్రకటించింది. ఆఫ్రికా నుంచి బయలుదేరినట్టుగా భావిస్తున్న ఈ బోట్లో దాదాపు 700 మంది ప్రయాణిస్తున్నట్టు అంచనా. ఇటీవల కాలంలో సుమారు వెయ్యి మంది ఇలా బలయ్యారు. జనవరి నుంచి 2.04 లక్షల మంది మధ్యధరా సముద్రం మీదుగా ఐరోపా దేశాలకు వలస వెళ్లారు. ఈ భయానక ప్రయాణంలో 2,500 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఎక్కువ మంది లిబియా నుంచి ఇటలీకి వెళుతున్న క్రమంలో మృత్యువాత పడ్డవారే.
శరణార్థుల పడవ మునక
Published Sat, Jun 4 2016 2:00 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మూడో భర్తతో విడాకులు తీసుకున్న స్టార్ సింగర్
IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
Namita Dubey: నిజమైన యాక్టర్స్.. తమ పాత్ర గురించే ఆలోచిస్తారు!
చంద్రబాబును ఏకిపారేసిన కొడాలి నాని..
రూ. 10కే హెయిర్ కటింగ్.. 4 గంటలు వేచి ఉంటున్న జనం!
ఇంట గెలవని రాణి..!
కారులో వెళ్తుండగా గ్రామస్తులు అడ్డుకుని చితకబాదారు: నటుడు
కూటమి మేనిఫెస్టో కాదు...టీడీపీ మేనిఫెస్టో..
సీఎం జగన్ హిందూపురం స్పీచ్..బాలకృష్ణ గుండెల్లో గుబులు..
తప్పక చదవండి
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- మహిళలపై టీడీపీ అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
Advertisement