వైఎస్ జగన్‌ను కలిసిన ఎస్‌పిఎస్‌ఎస్ నేతలు | Steel plant sadhana samiti leaders meet YS Jagan in Hyderabad | Sakshi
Sakshi News home page

వైఎస్ జగన్‌ను కలిసిన ఎస్‌పిఎస్‌ఎస్ నేతలు

Mar 24 2016 6:13 PM | Updated on Sep 4 2018 5:07 PM

ఎస్సార్ కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం స్థాపన కోసం పోరాటం చేస్తున్న స్టీల్ ప్లాంట్ సాధన సమితి (ఎస్‌పిఎస్‌ఎస్) నేతలు గురువారం హైదరాబాద్‌లో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు.

- కర్మాగారం స్థాపనకు కృషి చేయాలని వినతి

హైదరాబాద్ : వైఎస్సార్ కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం స్థాపన కోసం పోరాటం చేస్తున్న స్టీల్ ప్లాంట్ సాధన సమితి (ఎస్‌పిఎస్‌ఎస్) నేతలు గురువారం హైదరాబాద్‌లో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. వెనుకబడిన ప్రాంతమైన రాయలసీమలో ఈ కర్మాగారం స్థాపించాల్సిన అవశ్యకత గురించి ఆయనకు వివరించారు. ఈ మేరకు వైఎస్ జగన్‌కు సమితి నేతలు ఓ వినతిపత్రం  సమర్పించారు.

2014లో ఆంధ్రప్రదేశ్‌ను విభజించేటపుడు చేసిన చట్టంలోనే ఆరు నెలల్లో కడప స్టీల్ ఫ్యాక్టరీ ప్రారంభానికి చర్యలు తీసుకుంటామని పొందుపర్చారని, రాష్ట్రం ఏర్పడి 24 నెలలు దాటుతున్నా ఆ ఊసే లేదని ఇందులో పేర్కొన్నారు. అత్యంత వెనుకబడిన ప్రాంతమైన కడపలో ఈ ఫ్యాక్టరీ వస్తే విస్తృతస్థాయిలో అక్కడ ఆర్థిక కార్యకలాపాలు ముమ్మరం అవుతాయని, వేలాది మంది నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుందనీ పేర్కొన్నారు.

ఓ రకంగా రాయలసీమ వెనుకబాటుతనాన్ని, నిరుద్యోగ సమస్యను పరిష్కరించగలదని వినతిపత్రంలో సమితి నేతలు అభిప్రాయపడ్డారు. కర్మాగారం ఏర్పాటు కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని వారు జగన్‌ను కోరారు. అందుకు జగన్ వారితో ఏకీభవిస్తూ కర్మాగారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement