పంచలోహ విగ్రహం స్వాధీనం | recover the five metal statue | Sakshi
Sakshi News home page

పంచలోహ విగ్రహం స్వాధీనం

Feb 26 2015 8:00 PM | Updated on Apr 4 2019 5:25 PM

పంచలోహ విగ్రహాన్ని అమ్మేందుకు ప్రయత్నిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

లంగర్‌హౌజ్(హైదరాబాద్ క్రైం): పంచలోహ విగ్రహాన్ని అమ్మేందుకు ప్రయత్నిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన లంగర్‌హౌజ్‌లోని సనా హోటల్‌లో గురువారం జరిగింది. వివరాలు.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన హుస్సేన్‌షేక్(25) ఓల్డ్ అల్వాల్‌లో నివాసం ఉంటున్నాడు. అయితే, ఆరు రోజుల క్రితం సునీల్ అనే వ్యక్తి నుంచి మహవీర్ పంచలోహ విగ్రహాన్ని రూ. 2.5 లక్షలకు విక్రయించారు.

ఈ క్రమంలోనే ఆ విగ్రహన్ని తిరిగి రూ. 5 లక్షలకు అమ్మేందుకు ప్రయత్నిస్తుండగా లంగర్‌హౌజ్‌లోని సనా హోటల్‌లో నార్త్‌జోన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విగ్రహం విషయం ఆరా తీయగా జరిగిన విషయం పోలీసులకు తెలిపాడు. దీంతో పోలీసులు పరారీలో ఉన్న సునీల్ ఆచూకి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement