కండక్టర్‌పై చేయి చేసుకున్న ప్రయాణికురాలు | passenger beet of the conductor | Sakshi
Sakshi News home page

కండక్టర్‌పై చేయి చేసుకున్న ప్రయాణికురాలు

Apr 1 2015 12:26 AM | Updated on Sep 2 2017 11:38 PM

టికెట్ చిల్లర విషయంలో మహిళా కండక్టర్‌పై ఓ ప్రయాణికురాలు చేయిచేసుకున్న సంఘటన మలక్‌పేట పోలీస్‌స్టేషన్

మలక్‌పేట:  టికెట్ చిల్లర విషయంలో మహిళా కండక్టర్‌పై ఓ ప్రయాణికురాలు చేయిచేసుకున్న సంఘటన మలక్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానిక పోలీసులు తెలిపిన కథనం ప్రకారం... కూకట్‌పల్లి డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సు ఎల్బీనగర్ నుంచి యూసుఫ్‌గూడకు వెళ్తోంది. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో దిల్‌సుఖ్‌నగర్ ప్రాంతంలో ఓ మహిళ బస్సెక్కింది. టికెట్‌కు సరిపడా చిల్లర ఇవ్వాలని కండక్టర్ అడగడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

ప్రయాణికురాలు కండక్టర్‌పై చేయిచేసుకుంది.  దీంతో బస్సును మలక్‌పేట పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చి ఆ ప్రయాణికురాలిని పోలీసులకు అప్పగించి ఫిర్యాదు చేశారు. ప్రయాణికురాలు పుట్‌పాత్‌పై నివాసం ఉండే మహిళగా పోలీసులు గుర్తించారు. మూడు రోజుల పసికందును కలిగి ఉన్న మహిళ మత్తులో ఉండడం గమనార్హం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement