కవిత గత విషయాలు మరచినట్లున్నారు | Sakshi
Sakshi News home page

కవిత గత విషయాలు మరచినట్లున్నారు

Published Sun, Sep 4 2016 2:20 AM

కవిత గత విషయాలు మరచినట్లున్నారు - Sakshi

ఎమ్మెల్సీ రామచంద్రరావు

 సాక్షి, హైదరాబాద్: ఎంపీగా ఎన్నికయ్యాక కవిత గతం మరిచిపోయినట్లున్నారని బీజేపీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు విమర్శించారు. సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని ఆమె తండ్రి కేసీఆర్ ఎన్నికలకు ముందు డిమాండ్ చేసిన విషయాన్ని కవిత మరచిపోయినట్టున్నారని శనివారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ అన్నారు. ఈ ఉత్సవాలను అధికారికంగా జరపాలని బీజేపీ మాత్రమే డిమాండ్ చేయడం లేదని, రాష్ట్రంలోని వివిధ వర్గాల ప్రజలు కూడా గట్టిగా కోరుకుంటున్నారని చెప్పారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలానే టీఆర్‌ఎస్ ప్రభుత్వం కూడా ఎంఐఎం ఒత్తిళ్లకు తలొగ్గి, వీటి నిర్వహణకు సుముఖంగా లేదన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement