'పట్టిసీమతో సీమకు నీరివ్వడం ఎలా సాధ్యం' | how it possible to give water to seema by pattiseema, asks vishwaroop | Sakshi
Sakshi News home page

'పట్టిసీమతో సీమకు నీరివ్వడం ఎలా సాధ్యం'

Aug 14 2015 2:00 PM | Updated on Aug 20 2018 6:35 PM

ధవళేశ్వరంలో సరిపాడా నీటిమట్టం లేకుండా పట్టిసీమ ప్రాజెక్టును ఎలా ప్రారంభిస్తారని వైఎస్ఆర్ సీపీ నేత విశ్వరూప్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

హైదరాబాద్ : ధవళేశ్వరంలో సరిపాడా నీటిమట్టం లేకుండా పట్టిసీమ ప్రాజెక్టును ఎలా ప్రారంభిస్తారని వైఎస్ఆర్ సీపీ నేత విశ్వరూప్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పట్టిసీమ నిర్మాణం వల్ల కృష్ణా డెల్టాలో 35 టీఎంసీల నీరు కోల్పోతామని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా రాయలసీమకు నీరివ్వడం ఎలా సాధ్యమవుతుందున్నారు. పట్టిసీమ నిర్మాణం ఇంకా పూర్తికాలేదని, ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులన్నీ నాశిరకంగా ఉన్నాయంటూ విశ్వరూప్ ఆరోపించారు.

Advertisement
 
Advertisement
Advertisement