వేధింపులతో విద్యార్థిని బలవన్మరణం | 'Harassed' teen commits suicide | Sakshi
Sakshi News home page

వేధింపులతో విద్యార్థిని బలవన్మరణం

Dec 15 2016 9:36 AM | Updated on Jul 10 2019 8:00 PM

వేధింపులతో విద్యార్థిని బలవన్మరణం - Sakshi

వేధింపులతో విద్యార్థిని బలవన్మరణం

రంగారెడ్డి జిల్లా షామీర్‌పేట మండలంలో వేధింపులు తాళలేక ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది.

షామీర్‌పేట(రంగారెడ్డి): రంగారెడ్డి జిల్లా షామీర్‌పేట మండలంలో వేధింపులు తాళలేక ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలివీ... గ్రామానికి చెందిన శరణ్య(17) కేశవరంలోని బాలాజీ వెంకటేశ్వరస్వామి జూనియర్ కళాశాలలో సెకండియర్ చదువుతోంది. అయితే, ఆమెను గత కొంతకాలంగా ఇద్దరు యువకులు వేధిస్తున్నారు.

మనస్తాపం చెందిన శరణ్య ఈనెల 2వ తేదీన ఇంట్లోనే ఉరి వేసుకుని చనిపోయింది. అయితే, ఆమె బలవన్మరణానికి వేధింపులే కారణమని ఆలస్యంగా తెలుసుకున్న తల్లిదండ్రులు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు గ్రామానికి చెందిన ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement