ఉజ్జయిని మహంకాళికి బంగారు జడమాల | Sakshi
Sakshi News home page

ఉజ్జయిని మహంకాళికి బంగారు జడమాల

Published Thu, Jul 30 2015 6:41 PM

ఉజ్జయిని మహంకాళికి బంగారు జడమాల

జంటనగరాల వాసులు కొంగు బంగారంలా భావించే ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి మరో సరికొత్త ఆభరణం చేరింది. నగరానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ఒకరు అమ్మవారికి బంగారంతో జడమాల చేయించారు.

తలాచిగూడ ప్రాంతానికి చెందిన వ్యాపారవేత్త ధర్మపురి పద్మారావు 8.5 తులాల బంగారంతో ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి జడమాల చేయించారు. ఈ ఆభరణాన్ని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ చేతుల మీదుగా దేవస్థానం ఈవోకు అందజేశారు.

Advertisement
Advertisement