రాష్ట్రపతికి కేసీఆర్ పాదాభివందనం | chief minister k chandra sekhar rao touches president's feet | Sakshi
Sakshi News home page

రాష్ట్రపతికి కేసీఆర్ పాదాభివందనం

Jun 29 2015 2:21 PM | Updated on Aug 13 2018 3:55 PM

రాష్ట్రపతికి కేసీఆర్ పాదాభివందనం - Sakshi

రాష్ట్రపతికి కేసీఆర్ పాదాభివందనం

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు పాదాభివందనం చేశారు.

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు పాదాభివందనం చేశారు. హకీంపేట విమానాశ్రయంలో ఎయిర్ఫోర్స్ ప్రత్యేక విమానంలో దిగిన రాష్ట్రపతికి స్వాగతం పలికేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, రాష్ట్ర మంత్రులు, పలువురు ఎంపీలు వచ్చారు. నల్లటి బంద్ గలా సూటులో గవర్నర్ రాగా, తన బ్రాండు అయిన తెల్ల ప్యాంటు, తెల్లషర్టుతోనే కేసీఆర్ వచ్చారు.

ఆయనకు పుష్పగుచ్ఛం ఇచ్చిన వెంటనే కేసీఆర్.. తలవంచి పాదాభివందనం చేశారు. రాష్ట్రపతి ఆయనను భుజం తట్టి ఆశీర్వదించారు. లేచిన తర్వాత కూడా రెండు చేతులూ జోడించి ప్రణబ్ ముఖర్జీకి కేసీఆర్ నమస్కారం చేశారు. సాధారణంగా ప్రోటోకాల్ ప్రకారం నమస్కారం మాత్రమే చేస్తారు. కానీ ఇలా ముఖ్యమంత్రులు రాష్ట్రపతికి పాదాభివందనం చేయడం మాత్రం అరుదనే చెప్పుకోవాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement