జానారెడ్డి నేతృత్వంలో అఖిలపక్ష భేటీ | All parties meeting at assembley committee hall | Sakshi
Sakshi News home page

జానారెడ్డి నేతృత్వంలో అఖిలపక్ష భేటీ

Feb 3 2016 2:08 PM | Updated on Jul 11 2019 7:38 PM

తెలంగాణ అసెంబ్లీ కమిటీ హాల్ లో కాంగ్రెస్ సీనియర్ నేత కె.జానారెడ్డి నేతృత్వంలో అఖిలపక్ష భేటీ ప్రారంభమైంది.

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ కమిటీ హాల్ లో కాంగ్రెస్ సీనియర్ నేత కె.జానారెడ్డి నేతృత్వంలో అఖిలపక్ష భేటీ ప్రారంభమైంది. టీడీపీ శాసనసభాపక్ష నేత ఎర్రబెల్లి దయాకరరావు, బీజేపీ పక్షనేత లక్ష్మణ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున శివకుమార్ లు ఈ భేటీలో పాల్గొన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగిన తీరు, ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై చర్చించనున్నట్లు సమాచారం.

అఖిలపక్ష నేతల భేటీ అనంతరం గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ను ఈ నేతలు కలిసే అవకాశాలు ఉన్నాయి. ఎంఐఎం నేతలు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, షబ్బీర్ అలీ, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ తదితర నేతలపై దాడులకు పాల్పడ్డ విషయం విదితమే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement