టీచర్: చీమలను చూసి ఏం నేర్చుకోవాలి రా?
చింటు: తీపి తినడం, దాచుకోవడం
త్యాగం
నరేష్: ఒరే సోము, నీ బైకు ఎవరో ఎత్తుకెళ్లారంట... కంప్లయింట్ ఇవ్వలేదా?
సోము: ఎలా వచ్చింది అలా పోతుంది. దానికెందుకురా కంప్లయింట్!
చాలా బాగుంది
లేడీ డాక్టర్: గట్టిగా మూడు సార్లు గాలిపీల్చి వదలండి.
శంకర్రావు: వదిలానండి.
లేడీ డాక్టర్: ఇపుడేమనిపిస్తోంది?
శంకర్రావు: మీ సెంటు చాలా బాగుందనిపిస్తోందండీ
భర్తకు వైద్యం
భార్య: డాక్టరు గారూ, మా వారిని కొంచెం పరీక్షించండి
డాక్టరు: ఏమైంది?
భార్య: రాత్రిపూట నిద్రలో ఒకటే మాట్లాడుతున్నారు.
డాక్టరు: దానికి చికిత్స ఎందుకమ్మా, పగటి పూట నువ్వు ఆయనకు మాట్లాడే అవకాశం ఇస్తే చాలు.
పంచ్!
నాగరాజు: పొద్దున ఒక యజమాని గాడిదను కొడుతుంటే ఆపా, దీన్నేమంటారో తెలుసా?
గంగరాజు: సోదర ప్రేమ !!
పెళ్లి మానే అవకాశం
భక్తుడు: గురువు గారూ, నాకో ధర్మ సందేహం ఉంది.
గురువు: అడుగు నాయనా?
భక్తుడు: మనిషికి భవిష్యత్తు తెలిసిపోయే శక్తి వస్తే ఏం జరుగుతుంది?
గురువు: ఇక పెళ్లిళ్లు జరగవు నాయనా, ఆశ్రమాలు కిటకిటలాడుతాయి.
Related news
-
పెళ్లి చేసుకుంటా.. ఆ విషయంలో ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన హీరోయిన్
జాతిరత్నాలు చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన ముద్దుగుమ్మ ఫరియా అబ్దుల్లా. ఈ మూవీతో తెలుగు ఆడియన్స్కు మరింత దగ్గరైంది. ప్రస్తుతం అల్లరి నరేశ్కు జంటగా ఆ.. ఒక్కటీ అడక్కు అనే చిత్రంలో కనిపించనుంది. మల్లి అంకం దర్శకత్వంలో ఈ సినిమాను తెరెకెక్కించారు. రాజీవ్ చిలక నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా మే 3న థియేటర్లలో సందడి చేయనుంది.ఈ సందర్భంగా చిత్రబృందం మూవీ ప్రమోషన్స్ షురూ చేసింది. తాజాగా హీరోయిన్ ఫరియా ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. మూవీ విశేషాలను అభిమానులతో పంచుకున్నారు. అంతేకాకుండా తాజా ఇంటర్వ్యూలో తన పెళ్లి గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ సినిమా కాన్సెప్ట్ కూడా పెళ్లి గురించే కావడంతో ఫరియా చేసిన కామెంట్స్ తెగ వైరలవుతున్నాయి.ఫరియా మాట్లాడుతూ..' పెళ్లి అనేది రెండు కుటుంబాల కలయిక. ప్రస్తుతం జరుగుతున్న పెళ్లిళ్ల విషయంలో చాలా మార్పులొచ్చాయి. లైఫ్ పార్ట్నర్ను ఎంచుకునే విషయంలో పరిస్థితులు మారిపోయాయి. ఈ సినిమాలో పెళ్లిని మ్యాట్రీమొనీ సైట్స్ ఎలా డీల్ చేస్తారో చాలా ఎంటర్టైనింగ్గా చూపించాం. ఇందులో నరేశ్ తన కామెడీతో ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్విస్తారు. నా పెళ్లి విషయంలో స్వతహగా కొన్ని ఆలోచనలున్నాయి. ప్రస్తుతం నా దృష్టంతా కెరీర్పైనే . నాకు 30 ఏళ్లు దాటాకే పెళ్లి గురించి ఆలోచిస్తా. అయితే నాది కచ్చితంగా ప్రేమ వివాహమే. అంతే కాదు హీరోయిన్గా మాస్ మసాలా, కామెడీ, హారర్ థ్రిల్లర్స్ చేయాలని ఉంది. ప్రస్తుతం తెలుగులో యాక్షన్ సినిమాలు చేసే హీరోయిన్స్ తక్కువగా ఉన్నారు. నాకు ఆ ఖాళీని భర్తీ చేయాలని ఉంది.' అని అన్నారు. తన పెళ్లి గురించి ఫరియా మొత్తానికి ఓ క్లారిటీ ఇచ్చేసింది. -
మాజీ రెజ్లర్ను పెళ్లాడిన టెక్ సీఈఓ అంకుర్ జైన్.. ఫోటోలు
భారతీయ సంతతికి చెందిన అమెరికన్ వ్యాపారవేత్త, బిలినీయర్ 'అంకుర్ జైన్' గురించి దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. భారతీయ మూలాలున్న ఈయన బిల్ట్ రివార్డ్స్ సీఈఓగా ఉన్నారు. ఇటీవల ఈయన మాజీ డబ్ల్యూడబ్ల్యూఈ రెజ్లర్ 'ఎరికా హమ్మండ్'ను వివాహం చేసుకుని ఓ ఇంటివారయ్యారు.అంకుర్ జైన్, ఎరికా హమ్మండ్ ఏప్రిల్ 26న ఈజిప్ట్లోని పిరమిడ్స్ ఎదురుగా పెళ్లి చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ పెళ్లి వేడుకలకు కుటుంబ సభ్యులు, స్నేహితులతో పాటు.. పలువురు వ్యాపార, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.పెళ్లి కొంత భిన్నంగా ఉండాలనే ఆలోచనతోనే వారు దక్షిణాఫ్రికాలోని సఫారీ సందర్శనలో మొదలు పెట్టి ఈజిప్ట్లో పెళ్లి వేడుకలను ముగించారు. న్యూయార్క్ సిటీకి చెందిన భారత సంతతి బిలియనీర్ అంకుర్ జైన్ రంబుల్ బాక్సింగ్ జిమ్కి వెళ్లే సమయంలో.. ఎరికా హమ్మండ్, అంకుర్కు ఫిజికల్ ట్రైనర్గా వ్యవహరించారు. ఈ పరిచయం ప్రేమగా మారి ఇప్పుడు పెళ్లి వరకు వచ్చింది.ఎవరీ ఎరికా హమ్మండ్?ఎరికా హమ్మండ్ డబ్ల్యూడబ్ల్యూఈ రెజ్లర్. ఆమె రెజ్లింగ్ నుంచి బయటకు వచ్చిన తరువాత ఫిట్నెస్ కోచ్గా మారింది. ఈ సమయంలోనే బిలినీయర్ 'అంకుర్ జైన్'ను కలుసుకున్నారు. ఈమె స్ట్రాంగ్ అనే యాప్ కూడా స్టార్ట్ చేశారు. View this post on Instagram A post shared by Ankur Jain (@ankurjain) -
వైద్యం.. సువర్ణాధ్యాయం
నాడు..ప్రజారోగ్య పరిరక్షణ ధర్మాన్ని గత చంద్రబాబు ప్రభుత్వం గాలికొదిలేసింది. ప్రభుత్వ వైద్య రంగాన్ని విస్మరించింది. దివంగత సీఎం వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకాన్ని అంపశయ్యపైకి ఎక్కించింది. ఈ క్రమంలో ఏదైనా జబ్బు చేస్తే అప్పులు చేయాలి, అప్పు పుట్టని పరిస్థితుల్లో ఆస్తులు అమ్ముకోవాలి. ఆస్తులు లేని వాళ్లు దేవుడిపై భారం వేసి కాలం వెళ్లదీయాలి.రాష్ట్ర విభజనను బూచిగా చూపి 2014–19 మధ్య ఆర్థిక పరిస్థితులు బాగోలేవంటూ ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటు చేయలేమని చేతులు ఎత్తేశారు. 108, 104 వ్యవస్థకు పాతరేశారు. ప్రభుత్వాస్పత్రుల్లో రోగుల తాకిడికి అనుగుణంగా పోస్టుల భర్తీ చేపట్టలేదు. వసతులు కల్పించలేదు. అత్యవసర మందులు సైతం అందుబాటులో ఉంచలేదు. పారాసెటిమాల్ టాబ్లెట్ కావాలన్నా బయట తెచ్చుకోండని చీటీ రాసిచ్చే దుస్థితి. చిన్న పిల్లలను ఎలుకలు కొరికేసే పరిస్థితి. అయినప్పటికీ ఆ అధ్వాన్న పరిస్థితులే అద్భుతం అంటూ రామోజీ, ఎల్లో మీడియా బాబును ఆకాశానికి ఎత్తాయి. నేడు.. ఈ అధ్వాన్న పరిస్థితులను చక్కబెడుతూ ఈ ఐదేళ్ల పాలనలో నాడు–నేడు ద్వారా సీఎం వైఎస్ జగన్ వైద్య రంగాన్ని బలోపేతం చేశారు. వైద్యులు, వైద్య సిబ్బంది, ఇతర మానవ వనరుల కొరతకు ప్రణాళికా బద్ధంగా చెక్ పెట్టారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో కొత్తగా 17 ప్రభుత్వ వైద్య కళాశాలలను నిర్మిస్తున్నారు. ఆరోగ్యశ్రీ పథకానికి ఊపిరిలూదారు. పేదలు దురదృష్టవశాత్తు ఏదైనా జబ్బు బారిన పడితే వారి చికిత్సల బాధ్యతలను ప్రభుత్వమే తీసుకునే గొప్ప వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారు.ఐదేళ్ల పాలనలో రెండేళ్లు కరోనా తినేసింది. ఆర్థిక వ్యవస్థ దెబ్బ తినింది. అయినప్పటికీ ప్రజారోగ్యం విషయంలో వైఎస్ జగన్ ఏ మాత్రం రాజీ పడలేదు. మన ఇంట్లో వాళ్లకు ఎవరికైనా జబ్బు చేస్తే ఎలాంటి వైద్యం ఆశిస్తామో.. ఆ తరహాలో ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ వైద్యం అందించాలనే తాపత్రయంతో ‘ఫ్యామిలీ డాక్టర్’ కాన్సెప్్టకు శ్రీకారం చుట్టారు. బాగా అభివృద్ధి చెందిన దేశాల్లో సైతం సాధ్యం కాని ఈ విధానం ఏపీలో దిగి్వజయంగా అమలవుతుండటం పట్ల ప్రముఖుల నుంచి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ఆస్పత్రికి వెళ్తే వైద్యులు ఉంటారో లేదో? తమ జబ్బు నయమవుతుందా? అని ఒకప్పుడు సామాన్యుడు సర్కారు దవాఖానా అంటే ముఖం చాటేసేవాడు. ఆ దుస్థితి నుంచి ప్రభుత్వ వైద్యులే ప్రజల వద్దకు వెళ్లి సేవలు అందించే స్థాయికి నేడు వైద్య రంగం అభివృద్ధి చెందింది. నాడు–నేడు వంటి విప్లవాత్మక కార్యక్రమం, ఫ్యామిలీ డాక్టర్, జగనన్న ఆరోగ్య సురక్ష వంటి వినూత్న విధానాలు పేదోడి వైద్యానికి ఊపిరిపోశాయి.ఒక్క రూపాయి ఖర్చు కాకుండా ప్రజలకు అత్యాధునిక సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు అందుతున్నాయి. ఈ ఐదేళ్ల వ్యవధిలో పేద, మధ్య తరగతికి కావాల్సింది జగన్ చేసి చూపించారు. 17 మెడికల్ కళాశాలల ఏర్పాటు చేసి పేద, మధ్య తరగతికి వైద్య విద్యను చేరువ చేయడంతో పాటు మెడికల్ కాలేజీ ఆస్పత్రులతో అత్యాధునిక వైద్యం చేరువ చేశారు. బడ్జెట్తో సంబంధం లేకుండా మెరుగైన వైద్యం అందించాలనే సంకల్పం సీఎం జగన్ది.. అందుకే ఆయన యజ్ఞం ఫలించింది. ► ఉమ్మడి విజయనగరం జిల్లా జనాభా 20 లక్షలకు పైనే.. అయితే జిల్లాలో ఒక్క ప్రభుత్వ మల్టీస్పెషాలిటీ ఆస్పత్రి లేదు. మెరుగైన వైద్యం అవసరమైతే విశాఖపట్నం వెళ్లాల్సిందే. 2014 టీడీపీ ప్రభుత్వ హయాంలో జిల్లాకు ఒక వైద్య కళాశాల మంజూరు చేయాలని అసెంబ్లీ వేదికగా అడిగితే.. రాష్ట్ర ఆరి్థక పరిస్థితి బాగోలేదు. ప్రభుత్వ వైద్య కళాశాల సాధ్యం కాదు.. ప్రైవేట్ వైద్య కళాశాలకు అనుమతి ఇస్తున్నామని అప్పటి వైద్య శాఖ మంత్రి కామినేని సమాధానమిచ్చారు. ►ప్రతి జిల్లాలో ప్రభుత్వ వైద్య కళాశాలను ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీని నెరవేరుస్తూ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం విజయనగరంలో రూ.500 కోట్లతో కొత్త వైద్య కళాశాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. జిల్లా ఆస్పత్రిని బోధనాస్పత్రిగా అభివృద్ధి చేసి.. 2023–24 విద్యా సంవత్సరంలో 150 ఎంబీబీఎస్ సీట్లతో వైద్య కళాశాల ప్రారంభించారు. ఇప్పుడు కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా అక్కడ వైద్య సేవలందుతున్నాయి. ► జిల్లాకో ప్రభుత్వ వైద్య కళాశాల.. ఇంతవరకూ ఏ ప్రభుత్వం చేయని సాహసం.. ఏజెన్సీ అయినా, వెనుకబడిన ప్రాంతమైనా.. ప్రతి ఒక్కరికి నాణ్యమైన, ఖరీదైన వైద్యం ఉచితంగా అందాలనే సంకల్పంతో ఖర్చు ఎంతయినా వెనకాడకుండా.. వైద్య కళాశాలలు, ఆస్పత్రుల నిర్మాణం ప్రారంభించారు. 2023–24 విద్యా సంవత్సరంలో ఐదు ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రారంభించగా.. 2024–25లో 5, 2025–26లో 7 వైద్య కళాశాలలు ప్రారంభించనున్నారు. కొత్తగా 17 మెడికల్ కళాశాలలు స్వాతంత్య్రం వచ్చాక రాష్ట్రంలో ఏర్పాటైన ప్రభుత్వ మెడికల్ కాలేజీలు 11. సీఎం జగన్ పాలన వచ్చాక ఏకంగా 17 కళాశాలలు ఏర్పాటు చేస్తున్నారు. రూ.8,480 కోట్లతో వీటి నిర్మాణం ప్రారంభించారు. రాష్ట్రంలో ఒకే ఏడాది 5 వైద్య కళాశాలలను ప్రారంభించి సీఎం జగన్ కొత్త రికార్డు సృష్టించారు. విజయనగరం, ఏలూరు, రాజమహేంద్రవరం, మచిలీపట్నం, నంద్యాల వైద్య కళాశాలలను ప్రారంభించి ఒకే ఏడాది 750 ఎంబీబీఎస్ సీట్లలో అడ్మిషన్లు కల్పించారు. 1923లో రాష్ట్రంలో మొదటిగా ఆంధ్రా మెడికల్ కాలేజీ ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి 2019 వరకు ప్రభుత్వ రంగంలో కేవలం 11 కళాశాలలు మాత్రమే ఉన్నాయి.సీఎం జగన్ మాత్రం కేవలం ఐదేళ్లలో 17 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తూ ప్రజల మనసుల్లో నిలిచిపోయారు. ఈ విద్యా సంవత్సరం (2024–25)లో మార్కాపురం, మదనపల్లె, పాడేరు, పులివెందుల, ఆదోని మెడికల్ కాలేజీలు ప్రారంభిస్తారు. ఇప్పటికే ఈ ఐదు వైద్య కళాశాలల ఏర్పాటు కోసం నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ)కి దరఖాస్తు చేశారు. త్వరలో తనిఖీలు చేస్తారు. మిగిలిన ఏడు వైద్య కళాశాలలను 2025–26 విద్యా సంవత్సరంలో ప్రారంభించేందుకు వీలుగా చర్యలు మొదలు పెట్టారు.కొత్త వైద్య కళాశాలలతో మన విద్యార్థులకు వైద్య విద్య చదివేందుకు అవకాశం కల్పించడమే కాకుండా.. పరిసర ప్రాంతాల్లోని పేదలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు చేరువవుతాయి. కొత్తగా ప్రారంభించే కళాశాలల్లో ఎంబీబీఎస్ బ్యాచ్ పూర్తయ్యి బయటకు వచ్చే సమయానికి 600 పడకల సామర్థ్యంతో ఆస్పత్రులు కార్యకలాపాలు నిర్వహిస్తాయి. కొత్త బోధనాస్పత్రుల్లో కిడ్నీ, న్యూరో, కార్డియాలజీ, క్యాన్సర్ లాంటి సూపర్ స్పెషాలిటీ విభాగాల్ని ప్రభుత్వం మంజూరు చేస్తోంది. రేడియాలజీ, పాథాలజీ, మైక్రోబయాలజీ విభాగాల ఏర్పాటుతో వివిధ వ్యాధుల నిర్ధారణ సులభతరమవుతుంది.సూపర్హిట్.. ఫ్యామిలీ డాక్టర్ప్రభుత్వ వైద్య సేవలను ప్రజలకు చేరువ చేస్తూ సీఎం జగన్ ప్రభుత్వం ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ విధానంలో భాగంగా పీహెచ్సీల్లో ఇద్దరు వైద్యులకు తమ పరిధిలోని వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్ బాధ్యతలను అప్పగించారు. రోజు మార్చి రోజు తమకు కేటాయించిన విలేజ్ క్లినిక్లకు వెళ్లి వైద్య సేవలు అందిస్తున్నారు. 104 వాహనంతో పాటు వెళ్లి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ ఓపీ సేవలు, అనంతరం కదల్లేని స్థితిలో మంచానికే పరిమితమైన వృద్ధులు, వికలాంగులు, ఆరోగ్యశ్రీ రోగుల ఇళ్లకు వెళ్లి ఇంటి వద్దే వైద్యం చేస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి చిన్నారులు, విద్యార్థుల ఆరోగ్యం వాకబు చేస్తున్నారు. టెలిమెడిసిన్ కన్సల్టేషన్ ఇక్కడ అందుబాటులో ఉంది. ఫ్యామిలీ డాక్టర్ విధానం అమలులో విలేజ్ క్లినిక్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. 3.83 కోట్ల వైద్య సేవలు ఫ్యామిలీ డాక్టర్ ట్రయల్రన్ 2022 అక్టోబర్ 21న ప్రారంభించారు. పూర్తి స్థాయిలో గత ఏడాది ఏప్రిల్లో అందుబాటులోకి వచ్చింది.ఇంతవరకూ పీహెచ్సీ వైద్యులు 10,032 విలేజ్ క్లినిక్స్ను సందర్శించి 3,83,19,985 మందికి వైద్య సేవలు అందించారు. ‘ఫ్యామిలీ డాక్టర్’లో అందే వైద్య సేవలు ► జనరల్ అవుట్ పేషెంట్ సేవలు ► బీపీ, సుగర్, ఊబకాయం వంటి జీవనశైలి జబ్బుల కేసుల ఫాలోఅప్ ► గర్భిణులకు యాంటినేటల్ చెకప్స్, బాలింతలకు పోస్ట్నేటల్ చెకప్స్, ప్రసవానంతర సమస్యల ముందస్తు గుర్తింపు ► చిన్నపిల్లల్లో పుట్టుకతో వచ్చిన లోపాల గుర్తింపు ► రక్తహీనతతో బాధపడుతున్న మహిళలు, చిన్న పిల్లలకు వైద్య సేవలు ► ఆరోగ్యశ్రీలో శస్త్ర చికిత్స జరిగిన రోగులు, క్యాన్సర్, ఇతర దీర్ఘకాలిక జబ్బులతో మంచానికే పరిమితమైన వారికి, వృద్ధులకు ఇంటి వద్దే వైద్యం ► పాలియేటివ్ కేర్ 4 తాగునీటి వనరుల్లో క్లోరినేషన్ నిర్ధారణ ► 2,500 జనాభాకు ఒకటి చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 10,032 వైఎస్సార్ విలేజ్ క్లినిక్లను నెలకొల్పారు. ఫ్యామిలీ డాక్టర్లో సేవలు విభాగం వైద్య సేవలుజనరల్ ఓపీ 1,01,36,801 గర్భిణులు 28,76,014 బాలింతలు 8,81,412 రక్తహీనత 1,63,368 బీపీ 95,32,752 సుగర్ 57,23,906 బీపీ, సుగర్ 87,03,543 గ్రామాల్లోనే 14 రకాల వైద్య పరీక్షలు ► గర్భ నిర్ధారణకు యూరిన్ టెస్ట్ హిమోగ్లోబిన్ టెస్ట్ సుగర్ పరీక్ష ► మలేరియా పరీక్ష హెచ్ఐవీ నిర్ధారణ డెంగ్యూ టెస్ట్ మల్టీపారా యూరిన్► స్ట్రిప్స్ (డిప్ స్టిక్) అయోడిన్ టెస్ట్ వాటర్ టెస్టింగ్ హెపటైటిస్ బీ నిర్ధారణ ► ఫైలేరియాసిస్ టెస్ట్ సిఫిలిస్ ర్యాపిడ్ టెస్ట్ విజువల్ ఇన్స్పెక్షన్ స్పుటమ్ (ఏఎఫ్బీ) పార్వతీపురం మన్యం జిల్లాలోని బొబ్బిలి సామాజిక కేంద్రం(సీహెచ్సీ) చుట్టుపక్కల ఆరు మండలాల రోగులకు ఆధారం. గత టీడీపీ ప్రభుత్వంలో ఇక్కడ ముగ్గురు లేదా నలుగురు వైద్యులు మాత్రమే పనిచేసేవారు. ఆస్పత్రిలో మౌలిక సదుపాయాలు అంతంత మాత్రమే. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించేవారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆసుపత్రిని అభివృద్ధి చేశారు. ఓపీ బ్లాక్ పాత భవనాన్ని కూల్చి రూ.3.36 కోట్లతో నూతన భవనం నిర్మించారు. ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రికి దీటుగా నిర్మించారు. ఓపీ, ల్యాబ్, సర్జికల్, లేబర్ ఆపరేషన్ థియేటర్లు ఏర్పాటు చేశారు. పడకల సామర్థ్యం 50కు పెంచి తొమ్మిది మంది వైద్యులను సమకూర్చారు. పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం ఏరియా ఆస్పత్రిని గత టీడీపీ ప్రభుత్వంలో 50 పడకల నుంచి 100 పడకలకు పెంచుతామని హామీలిచ్చి గాలికి వదిలేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 100 పడకలకు ఆస్పత్రిని అప్గ్రేడ్ చేశారు. రూ.13 కోట్లతో నాడు–నేడులో మాతా శిశు సంరక్షణ విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఆస్పత్రిలో ఉండే 100 పడకలకు నిరంతరం ఆక్సిజన్ సరఫరా అవుతుంది. 2022లో ఈ విభాగాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. లేబర్ రూమ్, ఆపరేషన్ థియేటర్లతో అత్యాధునిక వైద్య పరికరాలు అందుబాటులో ఉంచారు. కార్పొరేట్ ఆస్పత్రులను తలదన్నేలా వార్డులు, ఆపరేషన్ థియేటర్లు, లేబర్ రూమ్, ఇతర వసతులను సమకూర్చారు.మానవ వనరుల కొరతకు చెక్ 2019 నుంచి ఇప్పటి వరకు వైద్యశాఖలో 54 వేల పోస్టులను భర్తీ చేశారు. బాబు హయాంలో కేవలం 4,469 పోస్టులు మాత్రమే భర్తీ చేశారు. నేడు ప్రతి పీహెచ్సీలో ఇద్దరు వైద్యులు, ముగ్గురు నర్సులు సహా 14 మంది సిబ్బంది అందుబాటులో ఉంటున్నారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వాస్పత్రుల్లో స్పెషలిస్ట్ వైద్యుల కొరత తీవ్రంగా ఉండగా.. ఏపీలో 94.6 శాతం స్పెషలిస్ట్ వైద్యులు ప్రభుత్వాస్పత్రుల్లో అందుబాటులో ఉన్నారు.రూ.వేల కోట్లతో అత్యాధునిక పరికరాలు 108 వ్యవస్థకు ఊపిరిలూదుతూ రూ.136 కోట్లతో 768 అంబులెన్స్లు సమకూర్చి సేవలు విస్తరించారు. ఫ్యామిలీ డాక్టర్ అమలుకోసం రూ.166 కోట్లతో 104 వాహనాలు సమకూర్చారు. మొత్తం 936 వాహనాలు సేవలందిస్తున్నాయి. రూ.1685.95 కోట్లతో ఆస్పత్రులకు కంప్యూటర్లు, ఇతర ఐటీ పరికరాలు సరఫరా చేశారు. విలేజ్ క్లినిక్స్, పీహెచ్సీలు, యూపీహెచ్సీలకు రూ.218.16 కోట్లతో మెడికల్ పరికరాలు అందించారు.పీహెచ్సీలు, సీహెచ్సీలు, ఏరియా, జిల్లా ఆస్పత్రుల్లో వైద్య పరీక్షలు నిర్వహించడానికి రూ.131.27 కోట్లతో పరికరాలు సమకూర్చారు. కేజీహెచ్, కర్నూలు, కాకినాడ జీజీహెచ్లకు రూ.46.11 కోట్లతో సీటీ, ఎంఆర్ఐ, క్యాథ్ల్యాబ్ సేవలను ప్రారంభించారు. క్యాన్సర్ వైద్యాన్ని బలోపేతం చేస్తూ రూ.190 కోట్లతో కేజీహెచ్, కర్నూలు, కడప ఆస్పత్రులకు అత్యాధునిక వైద్య పరికరాలు అందిస్తున్నారు. రూ.193.50 కోట్లతో ఏపీవీవీపీ ఆస్పత్రుల్లో ఐసీయూల అభివృద్ధి చేపట్టారు. డబ్ల్యూహెచ్ఓ ప్రమాణాల మేరకు మందులు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల మేరకు ఆస్పత్రుల్లో 608 రకాల మందులు అందుబాటులో ఉంచుతున్నారు. టీడీపీ హయాంలో 2014–19 మధ్య మందుల కోసం సుమారు రూ. 868 కోట్లు ఖర్చు చేశారు. ఏడాదికి సుమారు రూ.216 కోట్లు మాత్రమే వెచ్చించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 2019 నుంచి మందుల కోసం రూ. 2,090.39 కోట్లు ఖర్చు చేశారు. అంటే ఏడాదికి రూ. 418.07 కోట్ల వ్యయం ఆరోగ్య సురక్షలో 6.45 కోట్ల వైద్య పరీక్షలు అందరి ఆరోగ్యమే లక్ష్యంగా ప్రభుత్వం జగనన్న ఆరోగ్య సురక్షను ప్రవేశపెట్టింది. గ్రామాల్లోని జగనన్న సురక్ష శిబిరాల్లో స్పెషలిస్టు వైద్యులతో ఉచితంగా వైద్య సేవలు అందించి మందులు ఇస్తున్నారు. ఆస్పత్రుల్లో వైద్యం అవసరం ఉన్న వారికి ఆరోగ్యశ్రీలో ఉచితంగా చికిత్సలు నిర్వహిస్తున్నారు. గత ఏడాది ఈ కార్యక్రమం ప్రవేశపెట్టగా తొలి దశలో 60,27,843 మందికి ఉచిత వైద్య సేవలు అందించారు. వైద్య సిబ్బంది 1.45 కోట్ల గృహాలు సందర్శించి స్క్రీనింగ్ చేశారు. 6.45 కోట్ల వైద్య పరీక్షలు నిర్వహించారు. శిబిరాల్లో పరిశీలించిన అనంతరం వైద్యులు తదుపరి వైద్యం కోసం ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు రిఫర్ చేసి ఉచితంగా చికిత్సలు అందించారు. ఆస్పత్రులకు వెళ్లి సేవలు పొందేలా ప్రయాణ ఖర్చుల కోసం రూ.500 చొప్పున ప్రభుత్వం సాయం చేసింది. ఈ ఏడాది జనవరిలో రెండో దశ సురక్షను ప్రారంభించగా.. ఇంతవరకూ 10,881 శిబిరాలు నిర్వహించారు. రూ.16,880 కోట్లతో నాడు–నేడుతానిచ్చిన హామీని నెరవేరుస్తూ సీఎం జగన్ నాడు–నేడులో ఆస్పత్రుల రూపురేఖలు మార్చేశారు. అధ్వానంగా ఉన్న ఆస్పత్రులను ఐదేళ్లలో చక్కదిద్దారు. భవనాలకు మరమ్మతులు, పాతవాటి స్థానంలో కొత్తవాటి నిర్మాణం, 17 కొత్త వైద్య కళాశాలలు, సూపర్స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణం కోసం ఏకంగా రూ.16,880 కోట్లతో నాడు–నేడు కార్యక్రమం చేపట్టారు. 640 ఆస్పత్రులకు నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ (ఎన్క్వా‹Ù), 42 ఆస్పత్రులకు ముస్కాన్, 2022–23లో 3,161 ఆస్పత్రులకు కాయకల్ప గుర్తింపుతో దేశంలోనే మొదటి స్థానంలో ఏపీ నిలుస్తోంది. కేరళ సైతం ఈ అంశాల్లో ఏపీ కన్నా ఎంతో వెనుకబడి ఉంది. జగనన్న ఆరోగ్య సురక్ష –1లో సేవలు నిర్వహించిన శిబిరాలు – 12,423మొత్తం ఓపీలు – 60,27,843నిర్వహించిన వైద్య పరీక్షలు– 6,45,06,018మెరుగైన వైద్యం కోసం సిఫార్సు– 1,66,828జనరల్ సిఫార్సులో పూర్తయిన చికిత్సలు– 86,053కేటరాక్ట్ సిఫార్సులో పూర్తయిన చికిత్సలు– 80,115కంటి స్క్రీనింగ్– 9,52,066 (5.73 లక్షల మందికి అద్దాలు పంపిణీ)కొత్తగా గుర్తించిన బీపీ కేసులు– 2,51,529కొత్తగా గుర్తించిన సుగర్ కేసులు– 1,54,248జగనన్న ఆరోగ్య సురక్ష –2లో సేవలు నిర్వహించిన సురక్ష శిబిరాలు– 10,881 ఓపీలు– 38,58,410 నిర్వహించిన పరీక్షలు– 88,83,316 మెరుగైన వైద్యానికి సిఫార్సు– 17,558 సిఫార్సులో పూర్తయిన చికిత్సలు– 8,699 కళ్లద్దాలు అవసరమని గుర్తింపు– 2,09,319 అద్దాలు పంపిణీ– 1,70,594 -
ప్రముఖ నటుడి కుమార్తె పెళ్లి.. మెరిసిన సినీతారలు!
ప్రముఖ మలయాళ నటుడు కుంజన్ కుమార్తె వివాహం ఘనంగా జరిగింది. ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలో రాణిస్తున్న స్వాతి కుంజన్ అభినంద్ బసంత్ను పెళ్లాడింది. ఈ పెళ్లి వేడుకలో మలయాళ సినీ ప్రముఖులు హాజరై సందడి చేశారు. ఈ వివాహానికి మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి, మోహన్లాల్ కూడా హాజరయ్యారు. కాగా.. కుంజన్ ఇద్దరు కుమార్తెలు సంతానం కాగా.. స్వాతి రెండో అమ్మాయి.మమ్ముట్టికి కుటుంబం కుంజన్తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దీంతో వీరి పెళ్లికి మమ్ముట్టి తన భార్య సుల్ఫత్, దుల్కర్, కుమార్తె సురుమి కుటుంబంతో సహా వివాహానికి హాజరయ్యారు. కాగా.. ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలో స్వాతి తనదైన ప్రత్యేకతను చాటుకుంది. స్వాతికి నీతా అంబానీ హర్ సర్కిల్, ఫెమినాతో పనిచేసిన అనుభవం ఉంది. రెండేళ్లపాటు దుబాయ్లో ఫ్యాషన్ షోలలో పనిచేశారు. అంతే కాకుండా నీతా అంబానీ, దీపికా పదుకొనే, అదితి రావ్ హైదరీ, సుస్సానే ఖాన్లతో కలిసి పనిచేశారు. -
ప్రముఖ నటుడి కుమార్తె పెళ్లి.. మెరిసిన సినీతారలు!
ప్రముఖ మలయాళ నటుడు కుంజన్ కుమార్తె వివాహం ఘనంగా జరిగింది. ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలో రాణిస్తున్న స్వాతి కుంజన్ అభినంద్ బసంత్ను పెళ్లాడింది. ఈ పెళ్లి వేడుకలో మలయాళ సినీ ప్రముఖులు హాజరై సందడి చేశారు. ఈ వివాహానికి మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి, మోహన్లాల్ కూడా హాజరయ్యారు. కాగా.. కుంజన్ ఇద్దరు కుమార్తెలు సంతానం కాగా.. స్వాతి రెండో అమ్మాయి.మమ్ముట్టికి కుటుంబం కుంజన్తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దీంతో వీరి పెళ్లికి మమ్ముట్టి తన భార్య సుల్ఫత్, దుల్కర్, కుమార్తె సురుమి కుటుంబంతో సహా వివాహానికి హాజరయ్యారు. కాగా.. ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలో స్వాతి తనదైన ప్రత్యేకతను చాటుకుంది. స్వాతికి నీతా అంబానీ హర్ సర్కిల్, ఫెమినాతో పనిచేసిన అనుభవం ఉంది. రెండేళ్లపాటు దుబాయ్లో ఫ్యాషన్ షోలలో పనిచేశారు. అంతే కాకుండా నీతా అంబానీ, దీపికా పదుకొనే, అదితి రావ్ హైదరీ, సుస్సానే ఖాన్లతో కలిసి పనిచేశారు.
Related News by category
-
చైనాలోని రాచప్రాసాదం.. ఏకంగా 8వేలకు పైగా గదులు
ఈ ఫొటోలో కనిపిస్తున్నది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాసాదం. చైనా రాజధాని బీజింగ్లో దాదాపు 178 ఎకరాల సువిశాల ప్రాంగణంలో నిర్మించిన ఈ ప్రాసాదం ‘ఫర్బిడెన్ సిటీ’గా పేరు పొందింది. చైనాలోని మింగ్ వంశీయులు చేపట్టిన దీని నిర్మాణం 1406లో మొదలుపెడితే, 1420లో పూర్తయింది. హోంగ్వు చక్రవర్తి కొడుకు ఝుడి నాన్జింగ్ నుంచి బీజింగ్కు తన రాజధానిని మార్చుకున్నాక, బీజింగ్లో ఈ నిర్మాణం చేపట్టాడు. దాదాపు ఐదు శతాబ్దాల కాలం ఇది చైనా చక్రవర్తులకు రాచప్రాసాదంగా వర్ధిల్లింది. కమ్యూనిస్టు పాలన మొదలయ్యాక ఇది మ్యూజియంగా మారింది. దాదాపు ఒక ఊరంత విస్తీర్ణంలో ఉన్న ఈ సువిశాల ప్రాసాదంలో 980 భవంతులు, 8,886 గదులు ఉన్నాయి. యునెస్కో దీనిని 1987లోనే ప్రపంచ వారసత్వ నిర్మాణంగా ప్రకటించింది. ఈ అద్భుత నిర్మాణాన్ని ఏటా సుమారు 15 లక్షల మంది పర్యాటకులు సందర్శిస్తుంటారు. (చదవండి: Karnataka Sakaleshapura : సకలేశపుర చూడడానికి రెండు కళ్లు చాలవు.!) -
19 ఏళ్ల క్రితం మిస్సింగ్.. ఇప్పటికీ మిస్టరీగానే! ఎవరీ బ్రియానా?
ఈ రంగుల ప్రపంచంలో చీకటి లోకమనేది ఒకటుంటుందని, అందులో దేనికైనా తెగించే మనుషులుంటారని తెలుసుకోలేరు కొందరు. కేవలం తమ కలల ప్రపంచం వైపు పరుగులు తీస్తూ జీవితాలనే పోగొట్టుకుంటుంటారు. బ్రియానా మైట్ల్యాండ్ అనే 17 ఏళ్ల అమ్మాయి తన జీవితంలో అదే పొరబాటు చేసింది. అమెరికాలోని బర్లింగ్టన్ వర్మోంట్లో కెల్లీ, బ్రూస్ దంపతులకు 1986లో బ్రియానా జన్మించింది. ఈస్ట్ ఫ్రాంక్లిటన్ అనే చిన్న పట్టణంలో తన అన్నతో కలిసి పెరిగింది. పిల్లలిద్దరూ తల్లిదండ్రులతో పాటు తమ పొలాల్లోనే పనులకు వెళ్తూ, స్కూల్లో చదువుకునేవారు. ఇంట్లో అంతా ఆమెని ముద్దుగా బ్రీ అని పిలిచేవారు. బ్రీకి తన జీవనశైలి ఏమాత్రం నచ్చేది కాదు. పొలం పనులకు, పల్లె జీవితానికి దూరంగా ఉండాలనే ఉద్దేశంతో తనకు 17 ఏళ్ల వయసు వచ్చేసరికి ఇంటికి 15 మైళ్ల దూరంలో ఉన్న ఎనోస్బర్గ్ ఫాల్స్ హైస్కూల్లో చేరతానని పేరెంట్స్పై ఒత్తిడి తెచ్చింది. అక్కడే పట్టణంలో ఉద్యోగం చేసుకుంటూ చదువుకుంటానని పట్టుబట్టింది. మొదట సంకోచించిన పేరెంట్స్ చివరికి బ్రీ కోరికను కాదనలేకపోయారు. ఆరు నెలలు గడిచేసరికి ఆ హైస్కూల్ నుంచి డ్రాప్ ఔట్ అయ్యి.. ఇంకాస్త పైస్థాయికి వెళ్లేందుకు ఎఉఈ పరీక్షల కోసం ప్రిపేర్ అవ్వడం మొదలుపెట్టింది. అందుకోసం మోంట్గోమేరీకి దగ్గరల్లో తన చిన్ననాటి స్నేహితురాలు జిలియన్తో కలిసి రూమ్లో ఉంటూ, జాబ్ చేసుకుంటూనే చదువుకునేది. తనున్న పట్టణం తన బాయ్ ఫ్రెండ్ని కలవడానికి, ఉద్యోగానికి, భవిష్యత్తులో ఎదుగుదలకూ అనువైనదని ఆమె నమ్మింది. 2004 మార్చి 19 శుక్రవారం ఉదయాన్నే తన తల్లిని కలిసిన బ్రీ.. తనకు మరో పార్ట్ టైమ్ జాబ్ దొరికిందని, మర్నాడే డ్యూటీలో జాయి¯Œ అవుతానని చెప్పింది. ఆ ఆనందంలోనే కెల్లీని రెస్టారెంట్కి తీసుకెళ్లింది. అప్పుడే తన కెరీర్ గురించి తల్లితో మాట్లాడింది. మధ్యాహ్నం మూడున్నర దాటే సరికి రూమ్ దగ్గర డ్రాప్ చేసి, కెల్లీ వెళ్లిపోయింది. కెల్లీ బ్రీని చూడటం అదే చివరిసారి. అదేరోజు ఈవినింగ్ డ్యూటీకి వెళ్లిన బ్రీ సోమవారం వరకూ రాకపోయేసరికి రూమ్ మేట్ జిలియన్కి భయమేసి బ్రీ కుటుంబానికి, పోలీసులకు చెప్పింది. రంగంలోకి దిగిన పోలీసులు బ్రీ శుక్రవారం రాత్రి 11:20కే డ్యూటీ నుంచి తన రూమ్కు బయలుదేరిందని తెలుసుకున్నారు. డ్యూటీ తర్వాత పార్టీకి రమ్మని పిలిచిన కొలిగ్స్తో ‘రేపు ఉదయాన్నే న్యూ జాబ్లో జాయిన్ అవ్వాలి, ఇప్పుడు త్వరగా వెళ్లి రెస్ట్ తీసుకోవాలి’ అందట. మరో రెండు రోజులు గడిచేసరికి ఓ షాకింగ్ నిజం అక్కడ మీడియాని షేక్ చేసింది. అప్పటికే కేసు నమోదైన యాక్సిడెంట్ కారు ఎవరిదో కాదని, కనిపించకుండా పోయిన ‘బ్రీ’దేనని తేలింది. మార్చి 20 శనివారం ఉదయానికి మోంట్గోమెరీ రోడ్ నం. 118లో పాడుబడిన ఇంటిని చాలా విచిత్రంగా వెనుక నుంచి ఢీ కొట్టి ఉందట ఆ కారు. ఎవరో తాగుబోతు యాక్సిడెంట్ చేసి, పారిపోయి ఉంటాడని భావించిన ఓ పోలీసు దాన్ని స్థానిక గ్యారేజ్కి తరలించాడట. ఆ ఇల్లు ఓ నిర్మానుష్యమైన దారిలో పెద్ద మలుపు దాటగానే ఉంటుంది. అదేం ప్రమాదకరమైన మలుపు కూడా కాదు. అయితే ఈ వార్తలు వెలుగులోకి రావడంతో చాలామంది సాక్షులు ఆ కారుని తాము చూశామంటూ ముందుకొచ్చారు. ఆ రాత్రి పన్నెండుంపావుకి ఆ ఇంటిముందు హెడ్ లైట్స్ వెలుగుతున్న కారుని గమనించానని ఒకరు, పన్నెండున్నరకి లైట్స్ వెలగడంతో కారు టర్న్ చేస్తున్నారేమో అనుకున్నానని మరొకరు చెప్పారు. ఇక అసలు ట్విస్ట్ ఏంటంటే, ఆ రాత్రి రెండున్నర తర్వాత బ్రీ మాజీ బాయ్ ఫ్రెండ్ రోబాటియాలే కూడా ఆ కారుని చూశాడు. ఆగి, అక్కడ ఎవరూ లేకపోవడంతో కారు లైట్స్ ఆఫ్ చేసి, డోర్స్ క్లోజ్ చేసి, తన దారిన తాను వెళ్లిపోయాడట. ‘అది బ్రీ కారని నీకు తెలుసా?’ అని అడిగితే అప్పటికి తెలియదని చెప్పాడు. ఏది ఏమైనా 11.20కే కారులో బయలుదేరిన బ్రీ, పన్నెండుంపావుకే ఆ కారులో లేదు. యాక్సిడెంట్ అయిన ప్రదేశం తన ఆఫీస్కి చాలా దగ్గర్లో ఉంది. అంటే గంట సమయంలోనే తను మిస్ అయ్యింది. ఇక మరుసటి రోజు మార్చి 20న ఆ పోలీసు కారుని గ్యారేజ్కి పంపించకముందు ఓ బృందం విహారయాత్రకు వెళ్తూ ఆ కారుని చూసి ఆగింది. వారంతా తమ కెమేరాల్లో చాలా ఫొటోలు తీశారు. ఆ ఫొటోలే తర్వాత ఈ క్రైమ్సీన్ కి కీలక సాక్ష్యాలయ్యాయి. అయితే ఆ పర్యాటకులు కారు పక్కనే విరిగిన బ్రేస్లెట్ చూసినట్లు చెప్పారు. కానీ అది పోలీస్ రికార్డుల్లో లేదు. మొదట అనుమానం రోబాటియాలే మీదకు మళ్లింది. అయితే అతడు విచారణ కొనసాగుతుండగానే బైక్ యాక్సిడెంట్లో చనిపోయాడు. దాంతో కేసుకు ముందు సాగలేదు. బ్రీ మిస్సింగ్కి ఐదువారాల ముందు మౌరా ముర్రే అనే అమ్మాయి ఇలాంటి పరిస్థితుల్లోనే గల్లంతైంది. బ్రీ కారు దొరికిన ప్రదేశానికి సరిగ్గా 90 మైళ్ల దూరంలోనే ముర్రే కారుని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ దిశగా విచారణ జరిపినా ఫలితం లేదు. మిస్సింగ్కి 3 వారాల ముందు ఒక పార్టీలో బ్రీకి తన మాజీ స్నేహితురాలు లాక్రోస్కి మధ్య గొడవ జరిగిందట. లాక్రోస్ ఆ గొడవలో బ్రీని ముక్కు విరిగేలా కొట్టిందట. మార్షల్ ఆర్ట్స్లో ప్రావీణ్యం ఉన్న బ్రీ.. లాక్రోస్పై తన ప్రతాపాన్ని చూపించకుండా వదిలిపెట్టిందట. ఆ కథ తెలుసుకున్న పోలీసులు, లాక్రోస్ని కూడా విచారించారు. కానీ ఏ ఆధారం దొరకలేదు. ఇలా ఎంతమందిని ప్రశ్నించినా? నిజానిజాలు బయటపడలేదు. చాలామంది బ్రీ పారిపోయి ఉంటుందని నమ్ముతారు. కానీ అది నిజం కాదని వాదించేవారు, ఇదో మానవ అక్రమ రవాణా కేసని నమ్ముతారు. బ్రీ ఎవరి నుంచో తప్పించుకునే క్రమంలో కారు వెనక్కి టర్న్ చేసుకునేటప్పుడు ఆ యాక్సిడెంట్ జరిగి ఉంటుందని, అందుకే లైట్స్ వెలుగుతూ, డోర్స్ ఓపెన్ లోనే ఉన్నాయని ఊహిస్తుంటారు. పైగా కరాటేలో నిష్ణాతురాలైన బ్రీని ఒకరు కిడ్నాప్ చేయలేరని ఎక్కువ మందే ఉండి ఉంటారనేది డిటెక్టివ్స్ మాట. 2022 మార్చి 18న ఇప్పటి దాకా దొరకని కొత్త డీఎన్ఏ దొరికిందని వెళ్లడించడంతో అది క్రిమినల్ది అయ్యే అవకాశం ఉండొచ్చని ఆశ మొదలైంది. పదిహేడేళ్లప్పుడు మాయం అయిన బ్రీకి ఇప్పుడు సుమారు 36 ఏళ్లు ఉండి ఉండొచ్చు. అయితే గత 19 ఏళ్లుగా ఈ కేసు మిస్టరీగానే ఉంది. ∙సంహిత నిమ్మన -
నాకు మా బావ అంటే చాలా ఇష్టం.. కానీ
నాకు మా బావ అంటే చాలా ఇష్టం. మేనరికం పెళ్లి మంచిదికాదని తెలిసినా ఈ పెళ్లిని అవాయిడ్ చేయలేను. పెళ్లికి ముందే జెనెటికల్ కౌన్సెలింగ్ తీసుకుంటే నాకేమైనా హెల్ప్ అవుతుందా? – ఎన్కేఎస్, గుంటూరు మేనరికం పెళ్లి అనుకుంటే.. పెళ్లికి ముందే ఫ్యామిలీ అండ్ కపుల్ జెనిటిక్ కౌన్సెలింగ్ తీసుకోవడం చాలా అవసరం. దీనిని ప్రీకన్సెప్షనల్ జెనెటిక్ కౌన్సెలింగ్ అంటారు. మేనరికం పెళ్లిళ్లలో తరతరాలుగా అంటే తాతముత్తాతల నుంచి వస్తున్న సేమ్ జీన్స్తో కొన్ని జన్యుపరమైన లోపాలతో పిల్లలు పుట్టే రిస్క్ లేకపోలేదు. రక్తసంబంధీకుల మధ్య పెళ్లిళ్లు జరిగినప్పుడు కొన్ని రెసెసివ్ జెనెటిక్ వ్యాధులను చూస్తాం. మేనరికం పెళ్లిళ్లలో కాగ్నీషియల్ డిసీజెస్ అంటే పుట్టుకతో వచ్చే లోపాలు రెండు.. మూడు రెట్లు ఎక్కువ. మీరు కౌన్సెలింగ్ వెళ్లినప్పుడు మీ ఇద్దరి ఫ్యామిలీ ట్రీలో వంశపారంపర్యమైన జబ్బులు, డిజార్డర్స్ ఏవైనా ఉన్నాయా అని మీ మీ కుటుంబాల ఆరోగ్య చరిత్రను క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. జన్యుపరమైన వ్యాధి ఉన్న కుటుంబసభ్యుల వ్యాధి నిర్ధారణ, ఆ జన్యువుకి సంబంధించి ఎలాంటి మ్యుటేషన్ ఉంది వగైరా వివరాలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. అది క్యారియర్గా కపుల్కీ ఉన్నట్టయితే అది పిల్లలకు వచ్చే రిస్క్ ఎంత ఉందో చెప్తారు క్యారియర్ టెస్టింగ్లో.. భవిష్యత్లో గర్భస్థ శిశువుకి చేసే శాంప్లింగ్ ద్వారా ఆ వ్యాధి బిడ్డకు వస్తుందా లేదా అని కూడా తెలిపే డిటెక్షన్ టెస్ట్స్ ఉంటాయి. పుట్టే పిల్లలకు అవకరాలు ఉండే రిస్క్ ఎక్కువగా ఉంటే ప్రెగ్నెన్సీ మూడవ నెల, అయిదవ నెలలో వైద్యపరీక్షలతో కనిపెట్టి గర్భస్రావం చేయించుకోమని సూచిస్తాం. అందుకే బేసిక్ టెస్ట్స్కి హాజరవడం చాలా అవసరం. సాధారణంగా మేనరికం పెళ్లిళ్లలో బెటా తలసీమియా, సిస్టిక్ ఫైబ్రోసిస్, సికిల్ సెల్ అనీమియా వంటివి ఎక్కువ. వీటిని పెళ్లిచేసుకునే జంటకు చేసే మామూలు రక్తపరీక్షతో కూడా కనిపెట్టి రిస్క్ను అంచనావేయొచ్చు. జన్యుపరమైన వ్యాధులకు చికిత్స లేదు.. నివారణ మాత్రమే చేయగలం. నాకు 43 ఏళ్లు. పీరియడ్స్ రెగ్యులర్గా రావడంలేదు. స్కానింగ్ ద్వారా ఇంకెన్ని రోజుల్లో నాకు పీరియడ్స్ ఆగిపోవచ్చనేది తెలుసుకోవచ్చా? – జి. ప్రసన్నకుమారి, కోటగిరి మెనోపాజ్ అంటే నెలసరి పూర్తిగా ఆగిపోవడం. మామూలుగా నెలలు ఆగి.. ఏడాది వరకూ రాకపోతే దాన్ని మెనోపాజ్గా పరిగణిస్తాం. పెరీమెనోపాజ్.. అంటే మెనోపాజ్ కంటే రెండుమూడేళ్లు ముందు.. వెనుక టైమ్ అన్నమాట. అండాశయాల్లో అండాలు తయారుకానప్పుడు పీరియడ్స్ ఆగిపోతాయి. ఈస్ట్రోజెన్ హార్మోన్ బాగా తగ్గిపోతుంది. మెనోపాజ్కి సగటు వయసు 51 ఏళ్లు. నలభై అయిదేళ్లలోపు ఆగిపోతే ఎర్లీ మెనోపాజ్ అంటారు. అల్ట్రాసౌండ్ స్కానింగ్లో గర్భసంచి లైనింగ్ పలుచగా ఉండడం, అండాశయాల్లో అండాలు లేదా ఫాలికిల్స్ లేకపోవడం.. మెనోపాజ్ అని చెప్పడానికి కొన్ని మార్గాలు.. సూచనలు. నిర్ధారించడానికి ఫాలికల్ స్టిములేటింగ్ హార్మోన్ అనే రక్తపరీక్ష చేసినప్పుడు అది 35 కన్నా ఎక్కువ ఉంటే మెనోపాజ్ అని నిర్ధారిస్తారు. కొన్నిసార్లు ఒంట్లోంచి వేడివేడి ఆవిర్లు, ఆ వెంటనే చెమటలు, మూడ్స్వింగ్స్ వంటి లక్షణాలు కూడా ఉంటాయి. నెలలు ఆగిపోయిన తర్వాత కూడా గర్భసంచి లైనింగ్ పలుచగా కాకుండా దళసరిగా అంటే 5ఎమ్ఎమ్ కన్నా ఎక్కువగా ఉంటే తర్వాత పరీక్షల కోసం సూచిస్తాం. దీనిని ఎండోమెట్రియల్ హైపర్ప్లాజియా అంటారు. అందుకే 40 నుంచి 45 ఏళ్లలోపు నెలసరి ఆగిపోతే టీఎస్హెచ్, థైరాయిడ్ పరీక్షలను కచ్చితంగా చేయించాలి. డా‘‘ భావన కాసు గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్ హైదరాబాద్ -
నాకిప్పుడు 43 ఏళ్లు అనుకోకుండా ప్రెగ్నెన్సీ వచ్చింది..
మా పాపకు పద్దెనిమిదేళ్లు. ఛాతీ మరీ ఫ్లాట్గా ఉంది. ఇంప్రూవ్ అవడానికి ఏమైనా మందులు ఉన్నాయా? వాడితే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? – పి. పుష్పలత, అమలాపురం బ్రెస్ట్ డెవలప్మెంట్ సాధారణంగా తొమ్మిది నుంచి పదకొండేళ్ల మధ్య మొదలవుతుంది. ఈ గ్రోత్ ప్రతి అమ్మాయికి డిఫరెంట్గా ఉంటుంది. దాదాపుగా 17 – 18 ఏళ్లు వచ్చేసరికి బ్రెస్ట్ గ్రోత్ పూర్తవుతుంది. పరిమాణం, ఆకారం అందరమ్మాయిలకు ఒకేలా డెవలప్ అవదు. మస్సాజ్లు, క్రీములు, మాత్రలు, వ్యాయామం.. లాంటివేవీ కూడా బ్రెస్ట్ సైజ్ని, షేప్ని చేంజ్ చేయలేవు. రొమ్ములు ఫ్యాటీ టిష్యూతో ఉంటాయి. అది మజిల్ కాదు కాబట్టి వ్యాయామంతో బ్రెస్ట్స్ సైజ్ను పెంచలేం. బరువు తగ్గినప్పుడు బ్రెస్ట్ సైజ్ కూడా కొంత తగ్గవచ్చు. బరువు పెరిగినప్పుడు పెరగవచ్చు. కానీ ఇది తాత్కాలిక మార్పు మాత్రమే. కాస్మెటిక్ బ్రెస్ట్ సర్జరీ ద్వారా బ్రెస్ట్ సైజ్ను పెంచే అవకాశం ఉంది. కానీ దానికి సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలానే ఉంటాయి. స్కార్ టిష్యూ ఫామ్ అవడం, బ్రెస్ట్ ఫీడ్ చెయ్యలేకపోవడం వంటి శాశ్వత సమస్యలు కూడా ఉండొచ్చు. కొన్ని అరుదైన వ్యాధుల్లో కూడా బ్రెస్ట్ చాలా చిన్నగా ఉండొచ్చు. టర్నర్ సిండ్రోమ్ అనే జన్యుపరమైన డిజార్డర్లో కూడా ఫ్లాట్ చెస్ట్ అండ్ నిపుల్స్ ఉండొచ్చు. అలాంటి అనుమానాలేమైనా ఉంటే ఒకసారి గైనకాలజిస్ట్ని సంప్రదించండి. కొన్ని రక్తపరీక్షలు చేస్తారు. నాకిప్పుడు 43 ఏళ్లు. అనుకోకుండా ప్రెగ్నెన్సీ వచ్చింది. ఈ వయసులో పిల్లల్ని కంటే ఆరోగ్యంగా పుడతారా?ఇది నాకు తొలి కాన్పు. పిల్లల కోసం మందులు వాడీవాడీ విసిగిపోయి ఆపేశాక వచ్చిన ప్రెగ్నెన్సీ అండీ...! – ఎన్. చంద్రప్రభ, సిర్పూర్ కాగజ్నగర్ నలభై ఏళ్లు దాటిన ప్రెగ్నెన్సీలో చాలా రిస్క్స్ ఉంటాయి అనేది చాలామంది భయం. కానీ సింగిల్టన్ ప్రెగ్నెన్సీ సాఫీగా సాగే అవకాశం లేకపోలేదు. 25– 35 ఏళ్ల మధ్య ఉండే కాంప్లికేషన్స్ కన్నా కొంచెం ఎక్కువ రిస్క్ ఉండొచ్చు. వాటిలో ఆపరేషన్ ద్వారా డెలివరీ అవటం, నెలలు నిండక ముందే కాన్పు అయ్యే రిస్క్ వంటివి ఎక్కువ. ఐవీఎఫ్, కవలల ప్రెగ్నెన్సీలో ఈ రిస్క్ ఇంకాస్త పెరుగుతుంది. మొదటి మూడునెలల్లో పుట్టుక లోపాలు .. డౌన్సిండ్రోమ్ లాంటివి, గర్భస్రావం, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వంటి ప్రమాదాలు ఎక్కువుంటాయి. బాడీ పెయిన్స్, కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులూ ఎక్కువుండొచ్చు. డాక్టర్ని సంప్రదించినప్పుడు వాటికి తగిన ట్రీట్మెంట్ను ఇస్తారు. తొలి మూడునెలల్లో తప్పనిసరిగా జెనెటిక్ స్క్రీనింగ్ టెస్ట్స్ చేయించుకోవాలి. ప్రతినెల బీపీ, సుగర్, థైరాయిడ్ పరీక్షలూ చేయించుకోవాలి. ప్రతినెల తప్పకుండా గైనకాలజిస్ట్ను సంప్రదిస్తూ టైమ్కి చేయవలసిన స్కానింగ్లు, పరీక్షలు చేయించుకుంటూండాలి. సరైన చికిత్సతో నలభై ఏళ్లు దాటిన తర్వాత కూడా సురక్షితమైన, ఆరోగ్యకరమైన ప్రెగ్నెన్సీ, కాన్పూ సాధ్యమే. నేను కెరీర్ ఓరియెంటెడ్. సరోగసీ ద్వారా పిల్లల్ని కనాలనుకుంటున్నాను. దానివల్ల బ్రెస్ట్ ఫీడ్ ఇవ్వడం కుదరదు కాబట్టి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుందా? – రంజనీ ప్రసాద్, పుణె సరోగసీ ద్వారా పిల్లల కోసం ప్లాన్ చేసినా కొంతమంది.. మందుల ద్వారా బ్రెస్ట్ ఫీడ్కి ట్రై చేయవచ్చు. దాన్ని లాక్టేషన్ ఇండక్షన్ అంటారు. సరోగసీ బేబీ డెలివరీ టైమ్ కన్నా ముందు నుంచే మీరు బ్రెస్ట్ ఫీడ్ ట్రై చేయడానికి ప్రిపరేషన్ చేసుకోవాలి. అందరికీ ఇది సక్సెస్ కాకపోవచ్చు. కానీ బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల ప్రయోజనాలు అందరికీ తెలిసినవే. ఏడాది వరకు బ్రెస్ట్ ఫీడింగ్తో నాలుగు నుంచి అయిదు శాతం వరకు బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది. బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ అనేది హార్మోన్స్, జన్యుపరమైన, జీవనశైలి మీద ఆధారపడి పెరుగుతుంది. 5 నుంచి 10 శాతం జన్యుపరమైన కారణాలుంటాయి. బ్రెస్ట్ ఫీడ్ ఇవ్వనందువల్ల బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ కొంచెం మాత్రమే మారుతుంది. ఆరోగ్యకరమైన జీవనశైలి.. అంటే అధిక బరువు లేకుండా, సరైన బీఎమ్ఐ ఉండేలా క్రమం తప్పకుండా వ్యాయామాలు చేస్తూ .. పోషకాహరం తీసుకుంటూ ఉంటే క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది. హైరిస్క్ జన్యుపరమైన కారణాలు ఉన్నవారిలో అంటే బీఆర్సీఏ (ఆఖఇఅ) జీన్ పాజిటివ్ అని స్క్రీనింగ్లో తేలినవారిలో ప్రాఫిలాక్టిక్ సర్జరీల ద్వారా ఆ రిస్క్ను తగ్గించవచ్చు. బ్రెస్ట్స్ అల్ట్రాసౌండ్, మామోగ్రఫీ ద్వారా తొలిదశలోనే క్యాన్సర్ మార్పులను కనిపెట్టవచ్చు. ఈ రోజుల్లో సరోగసీతో పిల్లల్ని కన్నా కొన్ని మందుల ద్వారా బ్రెస్ట్ ఫీడ్ ఇచ్చేలా బిడ్డ.. తల్లి స్పర్శ పొందేలా చూస్తున్నాం. -
సద్దాం హుస్సేన్ వాడని ఓడ
ఈ ఫొటోలో కనిపిస్తున్న ఓడ ఇరాక్ మాజీ అధినేత సద్దాం హుస్సేన్ ముచ్చటపడి ప్రత్యేకంగా తయారు చేయించుకున్నది. అయితే, ఆయన తన జీవితకాలంలో ఎన్నడూ దీనిని వాడలేదు. నాలుగు అంతస్తులు, పద్దెనిమిది విశాలమైన గదులు, లోపల అధునాతన సౌకర్యాలతో రూపొందించిన ఈ 270 అడుగుల పొడవైన ఓడ పేరు ‘బస్రా బ్రీజ్’. ఇందులో ఫైవ్స్టార్ హోటల్ను తలదన్నే ఏర్పాట్లన్నీ ఉన్నాయి. ఒక సెలూన్, డ్రైక్లీనింగ్ రూమ్, ఫస్ట్ ఎయిడ్ రూమ్ వంటి సౌకర్యాలు కూడా ఉన్నాయి. సద్దాం హుస్సేన్ ఈ ఓడను ఒక డెన్మార్క్ కంపెనీ ద్వారా తయారు చేయించుకున్నాడు. దీని తయారీ 1980లో ప్రారంభమైంది. తయారీ పూర్తయ్యాక మరుసటి ఏడాది ఇది ఇరాక్ తీరానికి చేరుకుంది. ఇంత ప్రత్యేకంగా తయారు చేయించుకున్న ఈ ఓడలో సద్దాం హుస్సేన్ ఎన్నడూ అడుగుపెట్టలేదు. ఇరాక్ ప్రభుత్వం ప్రస్తుతం ఈ ఓడను బస్రా యూనివర్సిటీ ఆధ్వర్యంలో శాస్త్ర పరిశోధన కేంద్రంగా మార్చింది. నిజానికి ఇరాక్ ప్రభుత్వం 2018లో ఈ ఓడను 30 మిలియన్ డాలర్లకు (రూ.245 కోట్లు) అమ్మకానికి పెట్టినా, దీని కొనుగోలుకు ఎవరూ ముందుకు రాలేదు. చివరకు ఇప్పుడిది శాస్త్ర పరిశోధన కేంద్రంగా మారడంతో వార్తలకెక్కింది.
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
RR vs SRH: చెలరేగిన నితీష్ కుమార్.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
తెలంగాణకు రేవంత్రెడ్డి శనిలా పట్టాడు: హరీష్ రావు
కాంగ్రెస్ నేత వ్యాఖ్యలపై మండిపడ్డ మమతా బెనర్జీ
'కుబేర' సినిమా నుంచి నాగార్జున ఫస్ట్ లుక్ గ్లింప్స్ రిలీజ్
TS: ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు తేదీ పొడిగింపు
బీజేపీ కుట్రలు అడ్డుకుంటాం: సీఎం రేవంత్
విండీస్ క్రికెటర్కు బిగ్ షాకిచ్చిన ఐసీసీ.... ఐదేళ్ల పాటు నిషేధం
భర్తతో ఉన్న ఫోటోలు డిలీట్ చేయమన్న కత్రినా!
ఓపెనర్గా కోహ్లి.. రోహిత్ శర్మ ఏమన్నాడంటే?
ఈ బ్యూటీని గుర్తు పట్టారా? టీమిండియా స్టార్ భార్య.. రెండుసార్లు పెళ్లి! (ఫొటోలు)
Photos
View allVideo
View allతప్పక చదవండి
- కాంగ్రెస్ నేత వ్యాఖ్యలపై మండిపడ్డ మమతా బెనర్జీ
- 'కుబేర' సినిమా నుంచి నాగార్జున ఫస్ట్ లుక్ గ్లింప్స్ రిలీజ్
- ఓపెనర్గా కోహ్లి.. రోహిత్ శర్మ ఏమన్నాడంటే?
- T20 WC: కోహ్లిపై విమర్శలు.. చీఫ్ సెలక్టర్ స్పందన ఇదే
- రజనీకాంత్ సినిమా మేకర్స్కు ఇళయరాజా నోటీసులు
- ఏపీలో 4.14 కోట్ల మంది ఓటర్లు: ఏపీ ఎన్నికల అధికారి ఎంకే మీనా
- ప్రజ్వల్ రేవణ్ణపై లుక్ అవుట్ నోటీసులు..
- ఉడుపి హోటల్స్ ఎందుకంత ప్రసిద్ధి చెందాయో తెలుసా..!
- పవన్కు పోతిన మహేష్ బహిరంగ లేఖ.. ఆన్సర్ ప్లీజ్!
- ఏపీకి మహా ప్రమాదకారిగా బాబు & కో
Advertisement