టీడీపీలో ఇదో టైపు స్వచ్ఛంద ప్రచారం! | TDP party type of campaign! | Sakshi
Sakshi News home page

టీడీపీలో ఇదో టైపు స్వచ్ఛంద ప్రచారం!

Apr 11 2014 3:43 AM | Updated on Aug 14 2018 4:21 PM

టీడీపీలో ఇదో టైపు స్వచ్ఛంద ప్రచారం! - Sakshi

టీడీపీలో ఇదో టైపు స్వచ్ఛంద ప్రచారం!

టీడీపీలో సరికొత్త ప్రచారానికి తెరలేచింది. కొందరు ప్రతినిధులు... ‘పారిశ్రామిక అభివృద్ధి మండలి’ పేరుతో స్వచ్ఛందంగా ఎన్నికల ప్రచారం చేస్తామని పార్టీ అధినేత చంద్రబాబు వద్దకు గురువారం వచ్చారు.

పార్టీ వారే ‘పారిశ్రామిక అభివృద్ధి మండలి’ పేరుతో బస్సు యాత్ర
సాక్షి, హైదరాబాద్: టీడీపీలో సరికొత్త ప్రచారానికి తెరలేచింది. కొందరు ప్రతినిధులు... ‘పారిశ్రామిక అభివృద్ధి మండలి’ పేరుతో స్వచ్ఛందంగా ఎన్నికల ప్రచారం చేస్తామని పార్టీ అధినేత చంద్రబాబు వద్దకు గురువారం వచ్చారు. వీరి ప్రతిపాదనతో ఎంతగానో ఉబ్బితబ్బి బ్బైన చంద్రబాబు సదరు బస్సు యాత్రను జెండా ఊపి మరీ ప్రారంభించారు. అయితే, నిజానికి ఆ బస్సు యాత్రకు అవసరమైన ఏర్పాట్లన్నీ టీడీపీ అధినాయకత్వమే సమకూర్చింది.

 అంతేకాదు, యాత్ర చేస్తామని ముందుకొచ్చిన వారంతా ఆ పార్టీ లో పనిచేస్తున్న వారే కావడం గమనార్హం. వీరిలో.. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, గతంలో చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన అశోక్‌రాజ్, వైఎస్సార్ జిల్లా టీడీపీ నేతలు కందుల రాజమోహన్‌రెడ్డి, శివానందరెడ్డిల సోదరి శకుంతలారెడ్డి ఉన్నారు. బస్సు యాత్రను శకుంతలారెడ్డి సమన్వయం చేస్తున్నారు. యాత్ర ప్రారంభించిన సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, సీమాంధ్రను సింగపూర్ చేస్తానని మరోసారి చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement