మమ్మల్నే ఎందుకు అడుగుతారు? | Digvijay Singh comments on trd-congress alliance | Sakshi
Sakshi News home page

మమ్మల్నే ఎందుకు అడుగుతారు?

Apr 2 2014 5:31 PM | Updated on Aug 14 2018 4:21 PM

మమ్మల్నే ఎందుకు అడుగుతారు? - Sakshi

మమ్మల్నే ఎందుకు అడుగుతారు?

టీఆర్‌ఎస్‌తో పొత్తువిషయాన్ని ఆ పార్టీనే అడగాలని కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల పర్యవేక్షకుడు దిగ్విజయ్ సింగ్ అన్నారు.

న్యూఢిల్లీ: టీఆర్‌ఎస్‌తో పొత్తు విషయాన్ని ఆ పార్టీనే అడగాలని కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల పర్యవేక్షకుడు దిగ్విజయ్ సింగ్ అన్నారు. ఈ విషయం తమను ఎందుకు అడుగుతారని మీడియాను దిగ్విజయ్‌ సింగ్‌ ఎదురు ప్రశ్నించారు. సీపీఐతో పొత్తు ఖరారైందని తెలిపారు. సీమాంధ్రలో పోటీ చేసే అభ్యర్థులను ఖరారు చేసేందుకు రేపు స్క్రీనింగ్ కమిటీ సమావేశమవుతుందని చెప్పారు. తెలంగాణలో త్వరలోనే ప్రచారం మొదలు పెడతామని దిగ్విజయ్‌ సింగ్‌ తెలిపారు.

బీజేపీ మతతత్వ పార్టీ అని దిగ్విజయ్ అన్నారు. బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకుంటే లౌకికవాదం నుంచి పక్కకు పోయినట్టేనని అన్నారు. తెలంగాణకు మొదట మద్దతు పలికి, ఆ తర్వాత చంద్రబాబు వ్యతిరేకించారని గుర్తు చేశారు. ప్రతి అంశాన్ని చంద్రబాబు రాజకీయం చేశారని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement